Negative Energy : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని నెగటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ కనుక, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వున్నా, ఇబ్బందులు వున్నా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం ఇలా ఏవేవో సమస్యలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ని తరిమి కొట్టి, పాజిటివ్ ఎనర్జీ ని ఇంట్లోకి తీసుకురావాలంటే, ఇలా చేయడం మంచిది. ఇంట్లో విండ్ చైన్స్ ని వేలాడకడితే మంచిది. గాలికి అవి కదిలినప్పుడు, శబ్ద తరంగాలు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తాయి. ఇంటి మూలలలో ఉప్పు చల్లితే, ఇంట్లో దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి.
చిటికెడు ఉప్పు తీసుకొని ఇంటి ద్వారం వద్ద ఒక గుడ్డలో కట్టిపెట్టి లేదంటే డోర్ మేట్ కింద పెడితే, దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. అలానే, ఇంట్లో మంచి జరగాలన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా సరైన వెల్తురు ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లోకి వెల్తురు వచ్చే విధంగా కర్టైన్స్ ని పెట్టండి. ఏ గదిలో అయితే గాలి. వెల్తురు ఎక్కువగా ఉంటుందో, ఆ గదిలో దుష్టశక్తులు ఉండవు. ఎప్పటికప్పుడు, ఇంట్లో ఫర్నిచర్ ని కూడా సర్దుకుంటూ ఉండాలి. హోమ్ ఇంటీరియర్స్ ఎప్పుడూ కూడా, ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.
విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. పాడైపోయిన పాత సామాన్లు తొలగించుకోవాలి. బయట నుండి గాలి, వెలుతురు వచ్చే విధంగా వెంటిలేషన్ ఉండాల్సిందే. ఏ గదిలో కూడా చీకటి లేకుండా చూసుకోవాలి. వాటి ద్వారా, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో అగర్బత్తులని వెలిగించడం వలన మంచి సువాసన మాత్రమే కాదు.
ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి. ఇంటిని సర్దేటప్పుడు బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా తీసేస్తూ ఉండండి. వీటి వలన నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసారు కదా, ఎటువంటి వాస్తు చిట్కాలు అని పాటిస్తే మంచి జరుగుతుందని మరి ఈసారి తప్పులు చేయకుండా చూసుకోండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…