Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్గా యానిమల్ చిత్రంతో దేశ ప్రేక్షకులందరిని అలరించాడు. యానిమల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన రణ్బీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, తృప్తి డిమ్రీ పాత్రలకు విశేష ఆదరణ దక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గీతాంజలి పాత్ర ద్వారా అందం, ఫెర్ఫార్మెన్స్తో హీరోయిన్గా మరో మెట్టు ఎక్కిందనే కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలైంది. ప్రచార చిత్రాలతో ఓ రేంజ్లో అంచనాలను పెంచిన ఈ సినిమా మొదట కాస్తా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది.
కొందరు సినిమా కాస్తా లెంగ్తీగా ఉందని విమర్శించగా.. మరికొందరు మాత్రం ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, పాటలు ఇలా బాగున్నాయని.. రణబీర్ తన నటనతో అదరగొట్టారని రివ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరు చెప్పుకొస్తున్నారు. అసలు సినిమాని ఓ రేంజ్లో తీసావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆ విజువల్స్, ఆ టేకింగ్, ఆ మ్యూజిక్.. సూపర్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.600కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మరికొద్ది రోజులలో వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.
యానిమల్ సినిమా రెస్పాన్స్ చూసి దర్శకుడు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిత్రంపై మరింత హైప్ పెంచేందుకు ప్రమోషన్స్ చేస్తున్నారు. మూవీ ప్రచారం కోసం ఆయన ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని అన్నారు. చిరూతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు. తనకు చిరంజీవి ఇష్టమని గతంలో కూడా సందీప్ వెల్లడించగా, ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక యానిమల్ సినిమా.. మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు కామెంట్ చేస్తుండగా, దానిపై పరోక్షంగా స్పందించిన సందీప్.. సినిమాని సినిమా మాదిరిగా చూడాలని అన్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…