Shankhuvu : హిందూ మతంలో కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా భావిస్తారు. వాటికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా పవిత్రంగా భావించే వస్తువులల్లో శంఖం కూడా ఒకటి. హిందూ మత గ్రంథాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. అనంతరం శంఖాన్ని స్వీకరించారు. ఈ కారణం చేత శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. చాలా మంది ఇంట్లో శంఖాన్ని ఉంచుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు. శంఖం నుండి వచ్చే ధ్వనితో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చాలా మంది విశ్వసిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం మంచిదే అయినప్పటికి ఎలా పడితే అలా శంఖాన్ని ఉంచకూడదు.
ఇంట్లో శంఖం ఉంటే కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాలను పాటించకుంటే మంచి జరగడానికి బదులుగా చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకునే వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కూడా శంఖాన్ని నేలపై ఉంచకూడదు. శంఖాన్ని నేలపై ఉంచడం అంటే శంఖాన్ని అవమానించినట్టే. శంఖాన్ని ఎల్లప్పుడూ పీటపై ఉంచాలి. కటిక నేలపై ఉంచకూడదు. అలాగే శంఖాన్ని ఉపయోగించిన తరువాత శుభ్రం ఉంచాలి. శంఖంపై నీటి చుక్క కూడా లేకుండా చూసుకోవాలి. నీటి చుక్కల కారణంగా శంఖానికి నష్టం కలగవచ్చు. అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలోనే ఉంచాలి. లక్ష్మీ, విష్ణువు దగ్గర శంఖాన్ని ఉంచడం మంచిది.
అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ గుడ్డతో కప్పి ఉంచాలి. అదేవిధంగా ఇంటికి శంఖాన్ని ఎప్పుడు పడితే తీసుకురాకూడదు. శివరాత్రి, నవరాత్రి సమయంలోనే ఇంటికి శంఖాన్ని తీసుకురావాలి. ఈ రోజుల్లో శంఖాన్ని ఊదడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే శంఖాన్ని ఊదిన తరువాత శుభ్రం చేయడం చాలా అవసరం. శంఖం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. శంఖాన్ని ఊదిన తరువాత గంగాజలంతో లేదా నీటితో శుభ్రం చేసి తడి లేకుండా గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయేడం వల్ల శంఖం స్వచ్చంగా ఉంటుంది. అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. శంఖం యొక్క ఓపెన్ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరిగి నెగిటివిటీ తగ్గుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…