Money : మనుషులెవరైనా కష్టపడేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బతకడానికే కదా. వారు, వారితోపాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు. ధనవంతులుగా ఉంటారు. కానీ పేదరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా. అయితే మనం చేసే పలు రకాల పనుల వల్ల ధనవంతులం కాస్తా పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు, సమస్యలు మనల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట. మరి ఏయే పనుల వల్ల మనకు దరిద్రం కలుగుతుందో, వేటిని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాకకూడదు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట. అంతే కాకుండా ప్రతికూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి. అన్నీ సమస్యలను తెచ్చి పెడతాయి. నేలమీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు. అలాగే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితిలోనూ పొరపాటున కూడా అడుగుపెట్టకూడదు. అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది. సంపద అస్సలు కలసి రాదు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు. అలా చేస్తే అపశకునం కలుగుతుంది. దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది.
ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. అలా పడితే అంతా దురదృష్టమే కలుగుతుందట. ఏది చేసినా కలసి రాదట. సంపద అస్సలు దరి చేరదట. దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దరిద్ర దేవత వెంటాడుతుంది. సంపద అస్సలు చేకూరదు. శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తరువాత గంగా జలం (నీరు)తో కచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే పేదరికం కలుగుతుంది. ఉన్న సంపద అంతా తుడిచిపెట్టుకుపోతుందట.
దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు. అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచరాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట. దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట. దరిద్రులు అవుతారట. సంపద మొత్తం పోతుందట. ఈ 8 సూచనలను నారద పురాణంలో ఇచ్చారు. కనుకనే వీటి గురించి చెప్పాం. కాబట్టి ఈ పనులను చేయకండి. లేదంటే ఆపదలను కొని తెచ్చుకున్న వారవుతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…