Money : మనుషులెవరైనా కష్టపడేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బతకడానికే కదా. వారు, వారితోపాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు. ధనవంతులుగా ఉంటారు. కానీ పేదరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా. అయితే మనం చేసే పలు రకాల పనుల వల్ల ధనవంతులం కాస్తా పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు, సమస్యలు మనల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట. మరి ఏయే పనుల వల్ల మనకు దరిద్రం కలుగుతుందో, వేటిని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాకకూడదు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట. అంతే కాకుండా ప్రతికూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి. అన్నీ సమస్యలను తెచ్చి పెడతాయి. నేలమీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు. అలాగే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితిలోనూ పొరపాటున కూడా అడుగుపెట్టకూడదు. అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది. సంపద అస్సలు కలసి రాదు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు. అలా చేస్తే అపశకునం కలుగుతుంది. దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది.
ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. అలా పడితే అంతా దురదృష్టమే కలుగుతుందట. ఏది చేసినా కలసి రాదట. సంపద అస్సలు దరి చేరదట. దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దరిద్ర దేవత వెంటాడుతుంది. సంపద అస్సలు చేకూరదు. శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తరువాత గంగా జలం (నీరు)తో కచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే పేదరికం కలుగుతుంది. ఉన్న సంపద అంతా తుడిచిపెట్టుకుపోతుందట.
దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు. అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచరాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట. దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట. దరిద్రులు అవుతారట. సంపద మొత్తం పోతుందట. ఈ 8 సూచనలను నారద పురాణంలో ఇచ్చారు. కనుకనే వీటి గురించి చెప్పాం. కాబట్టి ఈ పనులను చేయకండి. లేదంటే ఆపదలను కొని తెచ్చుకున్న వారవుతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…