స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. కేవైసీ కోసం బ్యాంక్ దాకా వెళ్లాల్సిన పనిలేదని తెలియజేసింది. ఖాతాదారులు కేవైసీ పూర్తి చేసేందుకు సంబంధిత పత్రాలను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపినా చాలని తెలిపింది. ఈ క్రమంలో ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది ఖాతాదారులకు ఊరట కలిగించనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే కస్టమర్లకు చెందిన కేవైసీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించింది. దీంతో ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు తన ఖాతాదారులకు చెందిన కేవైసీ వివరాలను అప్ డేట్ చేస్తున్నాయి. అయితే కోవిడ్ కారణంగా గతేడాది నుంచి ఆర్బీఐ వీడియో కేవైసీకి అనుమతులు ఇచ్చింది. దీంతో కస్టమర్లు కొత్త ఖాతాలను తెరిచినా, ఇప్పటికే ఉన్న ఖాతాలకు అయినా సరే వీడియో కాల్ ద్వారానే కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
అయితే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారుల అకౌంట్లను ఎస్బీఐ హోల్డ్లో ఉంచింది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎస్బీఐ ఇందుకు మే 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే ఆలోగా ఎస్బీఐ కస్టమర్లు ఈ-మెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కేవైసీ పత్రాలను పంపి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అప్పటి వరకు అకౌంట్లను ఫ్రీజ్ చేయరు. కోవిడ్ నేపథ్యంలోనే ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇక కేవైసీ ప్రక్రియ కోసం ఖాతాదారులు పాస్పోర్టు, వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఏ కార్డు, పాన్ కార్డులలో ఏదైనా పత్రాన్ని సమర్పించవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…