రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ!

July 27, 2021 6:42 PM

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో మంది ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ వెసులుబాటు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది.

గతంలో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని చెప్పవచ్చు. అయితే కేవలం covid 19 నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను తగ్గించింది.

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఇక పై సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లకు వర్తిస్తుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ ధర కేవలం రూ.10 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజలకు భారీగా ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now