పోస్టాఫీసుల్లో మనకు డబ్బును పొదుపు చేసుకునేందుకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ (ఎన్ఎస్సీ) కూడా ఒకటి. ఇందులో డబ్బును సురక్షితంగా పొదుపు చేయవచ్చు. కేవలం రూ.100 తో డబ్బును పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. పెట్టే డబ్బుకు భారీ ఎత్తున వడ్డీని కూడా పొందవచ్చు. దీంతో కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
ఎన్ఎస్సీ కింద డబ్బును పొదుపు చేస్తే మెచూరిటీ గడువు 5 ఏళ్లు ఉంటుంది. అయితే 1 ఏడాది తరువాత కొన్ని షరతులకు లోబడి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్లో పొదుపు చేసే డబ్బుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద పొదుపు చేసుకునే డబ్బులకు ఏడాదికి 5.9 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.
ఈ స్కీమ్ కింద డబ్బును పొదుపు చేస్తే రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపులు పొందవచ్చు. ఇన్కమ్ట్యాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపులు పొందవచ్చు. 5 ఏళ్ల తరువాత మొత్తం డబ్బును లెక్కించి చెల్లిస్తారు. అయితే ప్రతి ఏటా అసలుకు వడ్డీని కూడా కలుపుతారు. తరువాత ఆ మొత్తానికి మరుసటి ఏడాదిలో వడ్డీ చెల్లిస్తారు. అందువల్ల వడ్డీకి వడ్డీ పొందవచ్చు.
ఇక ఈ స్కీమ్ కింద నెలకు రూ.100 పొదుపు చేయవచ్చు. 5 ఏళ్లలో రూ.15 లక్షలు పొదుపు చేస్తే 5.9 శాతం వడ్డీతో 5 ఏళ్ల తరువాత రూ.20.06 లక్షలు వస్తాయి. రూ.5.06 లక్షల వడ్డీ వస్తుంది. ఇలా ఈ పథకం ద్వారా అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుని లాభం పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…