రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇందులో పోస్టాఫీసులో తమ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం మంచి వడ్డీ రేట్లు కల్పిస్తోంది. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీల్లో పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసులో 5 సంవత్సరాల ఎఫ్డీ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తోంది. ఈ పథకలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15 లక్షల రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
ఈ స్కీమ్లో భాగంగా ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పోస్టాఫీసు 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయకుండా తర్వాత ఐదేళ్లకు కూడా పెట్టుబడి పెట్టాలి. ఇలా పదేళ్లల్లో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ. 5,51,175 సంపాదిస్తారు. అంటే మీ మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ.10,24,149 పొందవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు, 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు పొందవచ్చు.
అయితే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ను రెండుసార్లు మాత్రమే పొడిగించే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం పోస్టాఫీసులో ఏడాది టర్మ్ డిపాజిట్ స్కీమ్ 6.9 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే రెండేళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్పై 7 శాతం, మూడు సంవత్సరాల ఎఫ్డీపై 7.1 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే, మీరు ఎంచుకున్న స్కీమ్ పొడిగించుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏడాది డిపాజిట్ అయితే మెచ్యూరిటీకి 6 నెలల ముందే పొడిగింపు అభ్యర్థన చేసుకోవాలి. అలాగే రెండేళ్ల టెన్యూర్ అయితే ఏడాదిలోపే.. 3,5 ఏళ్లలోపు ఎఫ్డీ పై పొడిగింపునకు 18 నెలల లోపే పోస్టాఫీసుకు తెలియ జేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసే సమయంలోనూ టెన్యూర్ పొడిగింపుపై తెలియ జేసే అవకాశం ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్…
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన…
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా…
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా…
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్…
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు.…
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…