దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు నెలకొల్పబడుతున్నాయి. అంతే కాదు ఈ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి.తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ విక్రయించడం వంటి వాటితో వినియోగదారుల నుంచి డబ్బులు దొచేస్తున్నారు! కస్టమర్లను మోసం చేయడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది ఇలాంటి అనేక కిటుకులను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా పెట్రోల్ బంకుల్లో మోసపోకుండా ఉండటానికి ఈ కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా మోసపోయే అవకాశం ఉండదు.
పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది. దీనిని సింపుల్గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. వాహనదారులు కారులోంచి కిందకు దిగరు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు అని మర్చిపోకండి. చాలా పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిందకు దిగకపోవడం వల్లే ట్యాంక్ ఫుల్ చేస్తామనే పేరుతో వెహికల్ ఓనర్ని ఫూల్స్ని చేస్తున్నారు. పెట్రోల్ బంకు వాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.
కారు లేదా బైక్లో పెట్రోల్ లేదా డీజిల్ నింపుకునేటప్పుడు ముఖ్యంగా వాహనదారుడు వాహనం దిగి ఆయిల్ నింపే దగ్గర మీటర్ రీడింగ్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా మోసం చేశారని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో ఎలాంటి స్కామ్లు జరుగుతుంటాయో తెలుకోవాలి. వాటి నుంచి ఎలా బయట పడాలో కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల బంకుల్లో చేసే స్కామ్లను సులభంగా నివారించవచ్చు. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒక కంప్లైంట్ రిజిస్టర్ బుక్ను అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్సైట్లోనూ సదరు పెట్రోల్ బంక్పై ఫిర్యాదు చేయవచ్చు.మంచి పేరున్న ఇంధన స్టేషన్లో ఆయిల్ నింపుకోవడం ఉత్తమం. ఎప్పుడూ అలా చేయడం సురక్షితమైన ఆలోచన కూడా. వాహనదారులను మరియు ఇన్స్పెక్టర్లను మోసం చేయడానికి కొన్నిసార్లు మీటర్లు కూడా వక్రీకరించబడతాయి. కావున ఇటువంటి వాటిలో ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్…
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన…
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా…
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా…
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్…
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు.…
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…