ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. వారికి కొత్తగా రెండు క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. ఎల్ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంకు రెండూ కలిసి సంయుక్తంగా ఆ కార్డులను లాంచ్ చేశాయి. లుమైన్ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సీఎస్ఎల్ ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. లుమైన్ కార్డుతో ప్రతి రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను ఇస్తారు. అదే ఎక్లాట్ కార్డుతో అయితే 4 పాయింట్లను ఇస్తారు. ఈ కార్డులను ఉపయోగించి ప్రీమియం చెల్లిస్తే రివార్డు పాయింట్లు రెట్టింపు మొత్తంలో లభిస్తాయి.
ఇక లుమైన్ కార్డుదారులు 60 రోజుల్లో రూ.10వేలు ఖర్చు చేస్తే 1000 వెల్కమ్ బోనస్ పాయింట్లను ఇస్తారు. ఎక్లాట్ కార్డుకు అయితే 1500 పాయింట్లను ఇస్తారు. ఇక రెండు కార్డులకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ లేదా పర్మినెంట్ డిజేబిలిటీ కవర్, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో లాస్ట్ లయబిలిటీ వంటి సదుపాయాలను అందిస్తున్నారు.
ఈ కార్డులతో ఫ్యుయల్ కోసం ఖర్చు చేస్తే 1 శాతం పన్ను రద్దు చేస్తారు. రూ.400 ఆపైన చేసే ఇంధన ఖర్చులకు ఇది వర్తిస్తుంది. రూ.3000 అంతకన్నా ఎక్కువ మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్లను సులభంగా ఈఎంఐలకు మార్చుకోవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఫీజు ఉండదు. కార్డు హోల్డర్లు ఏవైనా వస్తువులను కొంటే 3, 6, 9, 12 నెలల ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…