Atal Pension Yojana Scheme : జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకుండా ఉండాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసినన్ని రోజులు బానే ఉంటుంది. ఆ తర్వాత, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఆర్థిక ఇబ్బందులు రాకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాదు. కేంద్ర ప్రభుత్వం కూడా, ఎన్నో స్కీములని తీసుకు వస్తూ వుంది. ఈ స్కీములతో చాలామంది ప్రయోజనం పొందుతున్నారు.
60 ఏళ్లు దాటిన తర్వాత, పనిచేసి డబ్బులు సంపాదించలేని పరిస్థితిలో, పెన్షన్ చాలా ముఖ్యం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ గా పెన్షన్ వస్తుంది. కానీ, సొంతవ్యాపారాలు, సొంత పని చేసుకునే అసంఘటిత రంగంలోని కార్మికులకి, పెన్షన్ వంటివి ఉండవు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం గురించి పూర్తి వివరాలను చూద్దాం.
పేద, మధ్య తరగతి వాళ్ళ కోసం, పలు రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో డబ్బులు పెడితే, వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నెలకు 10 వేల రూపాయలను ఇస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత, నెల నెలా పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ళు పైబడి 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు దీనిలో చేరచ్చు. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది.
భార్యాభర్తలు ఇద్దరు కూడా పథకంలో చేరొచ్చు. 5 వేల చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం కడితే, 10 వేలు పెన్షన్ వస్తుంది. జాతీయ బ్యాంకులు కి వెళ్లి, ఈ స్కీమ్ లో చేరచ్చు. ఇక ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే, 18 ఏళ్ల వయసులో చేరితే 42 రూపాయలను మీరు చెల్లిస్తే చాలు. ఒకవేళ 40 ఏళ్ల వయసులో చేరితే, నెలకు 210 కట్టాల్సి ఉంటుంది. ఇలా నెలకు 10 వేల రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…