Atal Pension Yojana Scheme : జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకుండా ఉండాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసినన్ని రోజులు బానే ఉంటుంది. ఆ తర్వాత, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఆర్థిక ఇబ్బందులు రాకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాదు. కేంద్ర ప్రభుత్వం కూడా, ఎన్నో స్కీములని తీసుకు వస్తూ వుంది. ఈ స్కీములతో చాలామంది ప్రయోజనం పొందుతున్నారు.
60 ఏళ్లు దాటిన తర్వాత, పనిచేసి డబ్బులు సంపాదించలేని పరిస్థితిలో, పెన్షన్ చాలా ముఖ్యం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ గా పెన్షన్ వస్తుంది. కానీ, సొంతవ్యాపారాలు, సొంత పని చేసుకునే అసంఘటిత రంగంలోని కార్మికులకి, పెన్షన్ వంటివి ఉండవు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం గురించి పూర్తి వివరాలను చూద్దాం.
పేద, మధ్య తరగతి వాళ్ళ కోసం, పలు రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో డబ్బులు పెడితే, వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నెలకు 10 వేల రూపాయలను ఇస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత, నెల నెలా పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ళు పైబడి 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు దీనిలో చేరచ్చు. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది.
భార్యాభర్తలు ఇద్దరు కూడా పథకంలో చేరొచ్చు. 5 వేల చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం కడితే, 10 వేలు పెన్షన్ వస్తుంది. జాతీయ బ్యాంకులు కి వెళ్లి, ఈ స్కీమ్ లో చేరచ్చు. ఇక ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే, 18 ఏళ్ల వయసులో చేరితే 42 రూపాయలను మీరు చెల్లిస్తే చాలు. ఒకవేళ 40 ఏళ్ల వయసులో చేరితే, నెలకు 210 కట్టాల్సి ఉంటుంది. ఇలా నెలకు 10 వేల రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…