Idli And Dosa : ఈరోజుల్లో చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బరువు తగ్గడం కోసం, చాలా ప్రయత్నాలు చేయాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలు పడితే, ఆ ఆహార పదార్దాలని తీసుకోకూడదు. అయితే, రోజూ రాత్రి పూట చాలామంది తక్కువ తినడం, లేదంటే అసలు ఆహారం తీసుకోకుండా ఉండిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. రాత్రిపూట కొంతమంది బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి కూడా తింటూ ఉంటారు.
రాత్రిపూట మీరు కూడా బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి తింటున్నారా..?, అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇటువంటి ఆహార పదార్థాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఉదయం పూట వీటిని తీసుకుంటే మంచిది. రాత్రిపూట మాత్రం తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట పులియపబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గర్భిణీలు, పాలిచ్చే వారు కూడా రాత్రిపూట పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. పెరుగు, పన్నీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి. తల్లులకు కనుక కడుపునొప్పి వచ్చింది అంటే, పిల్లలకు కూడా వచ్చేస్తుంది. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు, వీటికి దూరంగా ఉండటమే మంచిది.
కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా, రాత్రి పూట ఇటువంటివి తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కూడా, రాత్రి పూట ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. యాసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి కలుగుతాయి. ఇడ్లీ, దోస తీసుకుంటే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కలగొచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఇడ్లీ, దోస వంటివి రాత్రి తీసుకోవద్దు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…