దేశంలోని తమ కస్టమర్లకు త్వరలోనే 5జి సేవలను అందిస్తామని ఇప్పటికే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించిన విషయం విదితమే. జియోతోపాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా నెట్వర్క్ను ఏర్పాటు చేస్తూనే 5జి ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో 5జి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా ? అని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే 5జి ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కాగా ఇప్పటికే మార్కెట్లో పలు కంపెనీలు 5జి స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. అయితే అన్నింటికన్నా ముందు, తక్కువ ధరకే 5జి ఫోన్ను అందిస్తామని రియల్మి ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి వరకు అత్యంత తక్కువ ధరకే 5జి ఫోన్ను విడుదల చేస్తామని తెలిపారు. ఆ ఫోన్ ధర రూ.7వేలు ఉంటుందని, మొదటి సేల్లో 60 లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచుతామని అన్నారు.
అత్యంత తక్కువ ధరకు ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 5జి ఫోన్ను విడుదల చేయలేదు. దీంతో రియల్మి కంపెనీ ఆ విభాగంలో ముందుండాలని చూస్తోంది. అందుకనే అన్ని కంపెనీల కన్నా ముందు తామే బడ్జెట్ 5జి ఫోన్ను లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీల మధ్య 5జి ఫోన్ల కోసం పోటీ నెలకొందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…