సండే వచ్చిందంటే చాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఇంట్లో వివిధ రకాల నాన్ వెజ్ రెసిపీలు ఉండాల్సిందే. అయితే నాన్ వెజ్ లో ఎక్కువగా చికెన్ బిర్యాని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి హోటల్ రుచిని తలపించే యమ్మీ..యమ్మీ చికెన్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చికెన్ అరకిలో
*బాస్మతి రైస్ రెండు కప్పులు
*అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
*ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
*కరివేపాకు
*పుదీనా
*చిటికెడు పసుపు
*కొత్తిమీర
*ఉప్పు తగినంత
*కారం రెండు టేబుల్ స్పూన్లు
*పచ్చిమిర్చి ముక్కలు
*నూనె సరిపడినంత
*పెరుగు అర కప్పు
*నిమ్మకాయ
*బిర్యానీ దినుసులు(బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు,)
ముందుగా చికెన్ ను శుభ్రంగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ, పెరుగు వేసి బాగా కలియబెట్టి కొని ఒక అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఈ లోగ బాస్మతి బియ్యాన్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు వేసి అన్నం చేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని 70 శాతం మాత్రమే ఉడికించాలి. అదేవిధంగా స్టవ్పై మరొక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత బిర్యాని దినుసులు వేయాలి. అదేవిధంగా ముందుగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా అయితే బిర్యాని అంత రుచిగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఏర్పడగానే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర,పుదీనా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి ఓ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక లేయర్ ఉడికించిన చికెన్, దానిపై మరొక లేయర్ బాస్మతి రైస్ ఇలా పొరలుపొరలుగా వేసుకొని ఆ గిన్నెపై మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా మూత చుట్టూ మైదా పిండి పెట్టి బరువు పెట్టాలి. ఈ విధంగా ఐదు నిమిషాల పాటు తక్కువ మంట పెట్టడం వల్ల ఎంతో రుచికరమైన గుమగుమలాడే బిర్యాని తయారైనట్లే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…