BSNL Signal : టెలికాం కంపెనీలు మొబైల్ రీచార్జి ధరలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీలు రీచార్జి ధరలను ఇటీవల పెంచేశాయి. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయా నెట్వర్క్లలో ఉండలేక చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. అయితే బీఎస్ఎన్ఎల్కు గాను దేశంలో ఇంకా 4జి రాలేదు. 3జి సేవలే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు దేశమంతటా బీఎస్ఎన్ఎల్ 4జి సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పింది.
అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్లో మొబైల్ రీచార్జి ధరలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆ నెట్వర్క్కు మారుతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్కు వాస్తవానికి 4జి టవర్లు ఎక్కువగా లేవు. కనుక మీరు కూడా బీఎస్ఎన్ఎల్కు మారిపోవాలని చూస్తుంటే ముందుగా మీరు మీ ప్రాంతంలో 4జి టవర్ ఉందా.. లేదా.. అన్నది తెలుసుకోవాలి. దీంతో మీరు బీఎస్ఎన్ఎల్లోకి మారిపోయినా నెట్వర్క్ పరంగా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకోవాలంటే అందుకు కింద చెప్పిన ఓ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు మీ ఇంటర్నెట్ బ్రౌజర్లోకి వెళ్లి అక్కడ https://tarangsanchar.gov.in/emfportal అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో కిందకు వెళ్లి అక్కడ ఉండే my position అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం తెరపై మీ పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, కాప్చాను ఎంటర్ చేయాలి. తరువాత ఓటీపీని ఎంటర్ చేసి మెయిల్కి పంపుపై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీని ఎంటర్ ఏయాలి. అప్పుడు వచ్చే తెరపై మీకు మీ సమీపంలోని అన్ని సెల్ఫోన్ల టవర్ల మ్యాప్ కనిపిస్తుంది. అందులో సిగ్నల్ 2G/3G/4G లేదా 5Gని మీరు చూడవచ్చు. మీకు ఆపరేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీ ఏరియాలో BSNL సిగ్నల్ ఎలా ఉందో చెక్ చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…