BSNL Signal : టెలికాం కంపెనీలు మొబైల్ రీచార్జి ధరలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీలు రీచార్జి ధరలను ఇటీవల పెంచేశాయి. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయా నెట్వర్క్లలో ఉండలేక చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. అయితే బీఎస్ఎన్ఎల్కు గాను దేశంలో ఇంకా 4జి రాలేదు. 3జి సేవలే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు దేశమంతటా బీఎస్ఎన్ఎల్ 4జి సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పింది.
అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్లో మొబైల్ రీచార్జి ధరలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆ నెట్వర్క్కు మారుతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్కు వాస్తవానికి 4జి టవర్లు ఎక్కువగా లేవు. కనుక మీరు కూడా బీఎస్ఎన్ఎల్కు మారిపోవాలని చూస్తుంటే ముందుగా మీరు మీ ప్రాంతంలో 4జి టవర్ ఉందా.. లేదా.. అన్నది తెలుసుకోవాలి. దీంతో మీరు బీఎస్ఎన్ఎల్లోకి మారిపోయినా నెట్వర్క్ పరంగా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకోవాలంటే అందుకు కింద చెప్పిన ఓ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు మీ ఇంటర్నెట్ బ్రౌజర్లోకి వెళ్లి అక్కడ https://tarangsanchar.gov.in/emfportal అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో కిందకు వెళ్లి అక్కడ ఉండే my position అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం తెరపై మీ పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, కాప్చాను ఎంటర్ చేయాలి. తరువాత ఓటీపీని ఎంటర్ చేసి మెయిల్కి పంపుపై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీని ఎంటర్ ఏయాలి. అప్పుడు వచ్చే తెరపై మీకు మీ సమీపంలోని అన్ని సెల్ఫోన్ల టవర్ల మ్యాప్ కనిపిస్తుంది. అందులో సిగ్నల్ 2G/3G/4G లేదా 5Gని మీరు చూడవచ్చు. మీకు ఆపరేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీ ఏరియాలో BSNL సిగ్నల్ ఎలా ఉందో చెక్ చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…