ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఎన్నో యాప్స్, సైట్ల ద్వారా సేవలు అందిస్తోంది. వాటిల్లో గూగుల్ పే ఒకటి. దీని ద్వారా ఉచితంగానే యూపీఐ మాధ్యమంలో డబ్బులు పంపుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. అయితే మనం అందులో ఉచితంగానే డబ్బులను పంపించుకుంటాం కదా. మరి గూగుల్ పేకు రెవెన్యూ ఎలా వస్తుంది ? వారు ఆదాయం ఎలా పొందుతారు ? అనే ప్రశ్నలు మీకు ఉద్భవించవచ్చు. కానీ గూగుల్ పే ద్వారా కూడా గూగుల్కు ఆదాయం వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ పేలో మనం ఇంకొకరికి డబ్బులను పంపించుకోవడమే కాదు.. మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. పోస్ట్పెయిడ్ బిల్లులు, గ్యాస్, విద్యుత్ బిల్లులు, ఇతర బిల్లులను చెల్లించవచ్చు. అయితే ఆ బిల్లులను చెల్లించినప్పుడు బిల్లు మొత్తాన్ని బట్టి కొంత మొత్తంలో కమిషన్ సంబంధిత సంస్థ నుంచి గూగుల్ పేకు చేరుతుంది. ఇలా గూగుల్ పే కు ఆదాయం వస్తుంది.
సహజంగానే గూగుల్ పే లో బిల్లు చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి గూగుల్ పేకు ఆదాయం కూడా బాగానే వస్తుంది. అలాగే యూపీఐ ద్వారా మనం ఇతరులకు డబ్బులు పంపుతాం కదా.. అలాంటి యూజర్ల ట్రాన్సాక్షన్లకు చెందిన డేటా అంతా గూగుల్ పే దగ్గర ఉంటుంది. దాన్ని గూగుల్ తన సొంత పనులకు వినియోగించుకుంటుంది. అందే యూజర్లు ఖర్చు చేసే మొత్తాలను బట్టి వారి డేటాతో వారికి ఇంకా ఎలాంటి సేవలు అందించవచ్చు ? దాని ద్వారా ఎలా ఆదాయం రాబట్టవచ్చు ? అని ప్రయత్నిస్తుంది. ఇలా గూగుల్ కు గూగుల్ పే యాప్ ద్వారా కూడా ఆదాయం, లాభం రెండూ లభిస్తాయి.
కాగా 2020 సంవత్సరంలో గూగుల్ పేకు రూ.1501 కోట్ల ఆదాయం రాగా రూ.32.87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అందువల్ల మనకు చూసేందుకు గూగుల్ పే ఉచితంగా సర్వీస్ అందిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ దాని ద్వారా కూడా గూగుల్కు ఆదాయం వస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…