స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా కొత్తగా మోటోజి60, మోటోజి40 ఫ్యుషన్ పేరిట రెండు ఫోన్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో 6.8 ఇంచుల మాక్స్ విజన్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 732జి ప్రాసెసర్ను, 6జీబీ వరకు ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వీటిలో లభిస్తుంది. వీటిల్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 20 వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
జి60 ఫోన్లో వెనుక వైపు 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. జి40 ఫ్యుషన్ ఫోన్లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండింటికీ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.
మోటో జి60, మోటో జి40 ఫ్యుషన్ స్మార్ట్ ఫోన్లు డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపేన్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. మోటో జి60కి చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 27 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయిస్తారు.
మోటో జి40 ఫ్యుషన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ ఫోన్లను విక్రయిస్తారు. ఫ్లిప్కార్ట్లో లభిస్తాయి.
లాంచింగ్ సందర్భంగా జి40 ఫ్యుషన్ ఫోన్ పై రూ.1000, జి60 ఫోన్పై రూ.1500 వరకు ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఇన్స్టంట్ డిస్కౌంట్ను అందివ్వనున్నారు. దీంతో తగ్గింపు ధరలకు ఈ ఫోన్లు లభిస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…