స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా కొత్తగా మోటోజి60, మోటోజి40 ఫ్యుషన్ పేరిట రెండు ఫోన్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో 6.8 ఇంచుల మాక్స్ విజన్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 732జి ప్రాసెసర్ను, 6జీబీ వరకు ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వీటిలో లభిస్తుంది. వీటిల్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 20 వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
జి60 ఫోన్లో వెనుక వైపు 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. జి40 ఫ్యుషన్ ఫోన్లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండింటికీ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.
మోటో జి60, మోటో జి40 ఫ్యుషన్ స్మార్ట్ ఫోన్లు డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపేన్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. మోటో జి60కి చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 27 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయిస్తారు.
మోటో జి40 ఫ్యుషన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ ఫోన్లను విక్రయిస్తారు. ఫ్లిప్కార్ట్లో లభిస్తాయి.
లాంచింగ్ సందర్భంగా జి40 ఫ్యుషన్ ఫోన్ పై రూ.1000, జి60 ఫోన్పై రూ.1500 వరకు ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఇన్స్టంట్ డిస్కౌంట్ను అందివ్వనున్నారు. దీంతో తగ్గింపు ధరలకు ఈ ఫోన్లు లభిస్తాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…