టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆ రంగంలోకి సునామీలా ప్రవేశించింది. జియో దెబ్బకు కొన్ని టెలికాం సంస్థలు దుకాణాలను మూసేశాయి. ఇంకొన్ని విలీనం అయ్యాయి. తరువాత లైఫ్ పేరిట ఫోన్లను జియో లాంచ్ చేసింది. జియో ఫీచర్ ఫోన్లను కూడా జియో లాంచ్ చేసింది. అవన్నీ ఎంతో సక్సెస్ అయ్యాయి. అయితే త్వరలోనే ఓ నూతన ఆండ్రాయిడ్ ఫోన్ ను జియో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ జియో, ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్లు ఇప్పటికే ఓ బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ వివరాలను జియో గతంలోనే వెల్లడించింది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఓ బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ను లాంచ్ చేస్తామని కూడా గతంలోనే చెప్పారు. అయితే ఆ ఫోన్ను వచ్చే వినాయక చవితి రోజు మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇక జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్ బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆ ఫోన్ కోసం ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ యాప్స్కు అందులో సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ రెండు మోడల్స్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బేసిక్ మోడల్ ధర రూ.5000గా ఉండనున్నట్లు సమాచారం. ఇంకొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసి ఇంకో మోడల్ను రూ.7000కు లాంచ్ చేస్తారని తెలుస్తోంది.
అయితే ఈ ఫోన్లను వాటి ధరలో 10 శాతం చెల్లించి కొనుగోలు చేసే అవకాశాన్ని జియో కల్పించనుందని తెలుస్తోంది. అంటే రూ.5000 మోడల్ ధర రూ.500కు, రూ.7000 మోడల్ ధర రూ.700కు వస్తాయి. మిగిలిన మొత్తాన్ని సులభమైన ఈఎంఐలలో చెల్లించే విధంగా కస్టమర్లకు ఆప్షన్లను అందిస్తారు. ఈ క్రమంలోనే జియో పలు ఫైనాన్స్ సంస్థలతో ఇందుకు గాను భాగస్వామ్యం అవనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ, పిరామాల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అషూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ ఫోన్లను తక్కువ ఈఎంఐలకే కస్టమర్లకు అందించనుందని సమాచారం. ఇక ఈ ఫోన్లలో ఉండే ఫీచర్ల గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆరంభంలో ఈ ఫోన్కు గాను మొత్తం 5 కోట్ల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…