గుంటూరులో కోడలు అత్తను చపాతీ కర్రతో కొట్టి చంపిన ఘటన మరవకముందే రాజస్థాన్ లో ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. కూరగాయలు సరిగా కట్ చేయాలని చెప్పినందుకు కోడలు ఆవేశంతో అదే కత్తితో తన అత్త పై దాడి చేసింది. క్షణికావేశంలో కోడలు తన అత్తను 26 సార్లు కత్తితో పొడిచిన ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జైపూర్లోని భంక్రోటాకు చెందిన మోహినీ దేవి 14 సంవత్సరాల కిందట తన కొడుకుకి మమతా దేవి అనే అమ్మాయితో వివాహం జరిపించింది. అత్తా కోడళ్లు తన కొడుకు ముందు ఎంతో మంచిగా కనిపిస్తున్నప్పటికీ పరస్పరం ఎదురైతే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. ఈ క్రమంలోనే కూరగాయలు సరిగా కట్ చేయాలని అత్త తన కోడలిపై దుర్భాషలాడటంతో ఎంతో ఆగ్రహం చెందిన కోడలు ఏకంగా అదే కత్తి తీసుకుని అత్తపై దాడి చేసింది.
కోడలు మమతా దేవి ఆవేశంలో తన అత్తపై ఉన్న కోపంతో ఏకంగా ఆమె శరీరంలో 26 కత్తిపోట్లు పొడవడంతో మోహిని దేవి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే తన సామాగ్రిని, పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరార్ అయింది. విషయం తెలిసిన స్థానికులు మోహిని దేవి కొడుకుకి సమాచారం అందించగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహిని దేవి మృతి చెందడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మమతా దేవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…