BSNL 5G : మీరు ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL సిమ్ వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే మీకు 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అవును, నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. దేశంలో ప్రస్తుతం BSNLకు గాను కేవలం 3జి సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే 4జి పనిచేస్తోంది. అయితే 4జి కాకుండా ఏకంగా నేరుగా 5జి సేవలనే అందుబాటులోకి తెచ్చేందుకు BSNL కృషి చేస్తోంది. ఈ మేరకు BSNL సన్నాహాలు ప్రారంభించింది.
BSNL త్వరలోనే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు తన 5జి సేవల ద్వారా పోటీ ఇవ్వనుంది. హైస్పీడ్ డేటాతోపాటు హెచ్డీ క్లారిటీతో వాయిస్ కాల్స్ను చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. ఇక 5జి సేవలను అందించేందుకు గాను BSNL పలు స్టార్టప్లతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే దేశంలో కొన్ని చోట్ల 5జి ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. అందుకు గాను కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఈ ట్రయల్ రన్లో భాగంగా 700మెగా హెడ్జ్ బ్యాండ్ కింద 5జి సేవలను BSNL అందిస్తుంది.
ఇక ఈ ట్రయల్ రన్ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, బెంగళూరులోని ప్రభుత్వ ఇండోర్ కార్యాలయం, ఢిల్లీలోని సంచార్ భవన్, జేఎన్యూ క్యాంపస్, ఐఐటీ, ఇండియా హాబిటాట్ సెంటర్, గురుగ్రామ్లోని ఒక చోట, హైదరాబాద్లోని ఐఐటీ తదితర ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ఈ ప్రదేశాల్లోని వినియోగదారులకు ముందుగా BSNL5జి సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తారు.
అయితే BSNL గనక అనుకున్న ప్రకారం 5జి ట్రయల్స్ను నిర్వహించి విజయవంతం అయితే ఈ ఏడాది చివరి నుంచే దేశీయ BSNL వినియోగదారులకు 5జి సేవలు లభ్యం అవుతాయి. దీంతో ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరలకే వినియోగదారులు డేటా, వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని, వాలిడిటీని పొందుతారు. మరి దేశవ్యాప్తంగా BSNLలో 5జి సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…