టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.456కు ఓ ప్రీపెయిడ్ ప్యాక్ను లాంచ్ చేసింది. జియో ఇటీవలే ఎలాంటి రోజువారీ లిమిట్ లేకుండానే కొత్త ప్లాన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. అందుకు పోటీగా ఎయిర్టెల్ ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో లభించనున్న సదుపాయాలు ఇలా ఉన్నాయి.
రూ.456 ప్లాన్ను రీచార్జి చేసుకుంటే 50 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి రోజు వారీ లిమిట్ లేదు. ఈ ప్యాక్ వాలిడిటీని 60 రోజులుగా నిర్ణయించారు. కనుక అప్పటిలోగా డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఉచిత సేవలను పొందవచ్చు. ఫాస్టాగ్పై క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ ప్యాక్ను ఎయిర్టెల్ వెబ్సైట్, యాప్, ఇతర విధానాల్లో రీచార్జి చేసుకుని ఉపయోగించవచ్చు. కాగా జియోలో రూ.447 ప్లాన్లో 50జీబీ డేటా లభిస్తుంది. దీనికి 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. ఎప్పుడైనా ఎంత డేటాను అయినా వాడుకోవచ్చు. ఈ ప్లాన్లో కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…