టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.456కు ఓ ప్రీపెయిడ్ ప్యాక్ను లాంచ్ చేసింది. జియో ఇటీవలే ఎలాంటి రోజువారీ లిమిట్ లేకుండానే కొత్త ప్లాన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. అందుకు పోటీగా ఎయిర్టెల్ ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో లభించనున్న సదుపాయాలు ఇలా ఉన్నాయి.
రూ.456 ప్లాన్ను రీచార్జి చేసుకుంటే 50 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి రోజు వారీ లిమిట్ లేదు. ఈ ప్యాక్ వాలిడిటీని 60 రోజులుగా నిర్ణయించారు. కనుక అప్పటిలోగా డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఉచిత సేవలను పొందవచ్చు. ఫాస్టాగ్పై క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ ప్యాక్ను ఎయిర్టెల్ వెబ్సైట్, యాప్, ఇతర విధానాల్లో రీచార్జి చేసుకుని ఉపయోగించవచ్చు. కాగా జియోలో రూ.447 ప్లాన్లో 50జీబీ డేటా లభిస్తుంది. దీనికి 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. ఎప్పుడైనా ఎంత డేటాను అయినా వాడుకోవచ్చు. ఈ ప్లాన్లో కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…