దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. సచిన్ కి మార్చి 27వ తేదీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సచిన్ కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. సచిన్ కరోనా బారిన పడిన ఆరు రోజుల తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఇవాళ ఆస్పత్రిలో చేరారు.
సచిన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు. “వైద్యుల సలహా మేరకే ఆస్పత్రిలో చేరాను. తొందరలోనే కోలుకుని తిరిగి వస్తాను. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచ కప్ పదవ వార్షికోత్సవ సందర్భంగా తోటి క్రికెటర్లకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు” అని సచిన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగానే ఉండగా, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాజాగా రోడ్ సేఫ్టీ సిరీస్ లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర క్రికెటర్ లైన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…