దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. సచిన్ కి మార్చి 27వ తేదీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సచిన్ కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. సచిన్ కరోనా బారిన పడిన ఆరు రోజుల తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఇవాళ ఆస్పత్రిలో చేరారు.
సచిన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు. “వైద్యుల సలహా మేరకే ఆస్పత్రిలో చేరాను. తొందరలోనే కోలుకుని తిరిగి వస్తాను. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచ కప్ పదవ వార్షికోత్సవ సందర్భంగా తోటి క్రికెటర్లకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు” అని సచిన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగానే ఉండగా, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాజాగా రోడ్ సేఫ్టీ సిరీస్ లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర క్రికెటర్ లైన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…