భారత మాజీ బ్యాట్స్మన్ సచిన్ టెండుల్కర్ కరోనా బారిన పడ్డాడు. ఈ మేరకు సచిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ట్విట్టర్ ద్వారా సచిన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. తనకు కోవిడ్ 19 స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో వెంటనే అప్రమత్తమై పరీక్ష చేయించుకున్నానని, అందులో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.
కాగా తాను ఇంట్లో క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని సచిన్ తెలిపాడు. అయితే కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారని, కానీ కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నాడు. అయినప్పటికీ తన చుట్టూ తిరిగిన వారు, ఉన్నవారు క్వారంటైన్లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. ఇక తనకు మద్దతు ఇస్తున్న ఫ్యాన్స్ తోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు.
కాగా సచిన్ భారత క్రికెట్ జట్టుకు 1989 నుంచి 2013 వరకు ఆడాడు. మొత్తం 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ సచిన్ కావడం విశేషం. అలాగే వన్డేలు, టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది. టెస్టుల్లో సచిన్ 15,291 పరుగులు చేయగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్లో సచిన్ ఇండియా లెజెండ్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో భారత్ ఫైనల్ లో శ్రీలంక లెజెండ్స్పై విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…