భారత మాజీ బ్యాట్స్మన్ సచిన్ టెండుల్కర్ కరోనా బారిన పడ్డాడు. ఈ మేరకు సచిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ట్విట్టర్ ద్వారా సచిన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. తనకు కోవిడ్ 19 స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో వెంటనే అప్రమత్తమై పరీక్ష చేయించుకున్నానని, అందులో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.
కాగా తాను ఇంట్లో క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని సచిన్ తెలిపాడు. అయితే కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారని, కానీ కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నాడు. అయినప్పటికీ తన చుట్టూ తిరిగిన వారు, ఉన్నవారు క్వారంటైన్లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. ఇక తనకు మద్దతు ఇస్తున్న ఫ్యాన్స్ తోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు.
కాగా సచిన్ భారత క్రికెట్ జట్టుకు 1989 నుంచి 2013 వరకు ఆడాడు. మొత్తం 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ సచిన్ కావడం విశేషం. అలాగే వన్డేలు, టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది. టెస్టుల్లో సచిన్ 15,291 పరుగులు చేయగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్లో సచిన్ ఇండియా లెజెండ్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో భారత్ ఫైనల్ లో శ్రీలంక లెజెండ్స్పై విజయం సాధించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…