అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం విదితమే. శనివారం పోలింగ్ ప్రారంభం కాగా మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, భారీ స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు. ఈ మేరకు మోదీ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
అస్సాంలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఓట్లు వేయండి. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని మోదీ అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనాలని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరపాలని అన్నారు.
అస్సాంలో మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని, అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు ఓట్లు భారీగా వేయాలని పిలుపునిచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…