ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 27వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టన్నింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి రెండు బంతుల్లో పొల్లార్డ్ విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో అంబటి రాయుడు, డుప్లెసిస్, మొయిన్ అలీలు అద్భుతంగా రాణించారు. 27 బంతుల్లోనే రాయుడు 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, మొయిన్ అలీ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో కిరన్ పొల్లార్డ్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, బౌల్ట్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్మెన్లలో పొల్లార్డ్ అద్భుతంగా రాణించాడు. 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. డికాక్, రోహిత్ శర్మలు 38, 35 పరుగుల చొప్పున సాధించారు. చెన్నై బౌలర్లలో శామ్ కుర్రాన్ 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీలకు తలా 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…