కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్లను ధరించి బాధను దిగమింగుతూ చికిత్స చేస్తున్నారు. మరోవైపు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మరో డాక్టర్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన డాక్టర్ వివేక్ రాజ్ (36) ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి ఐసీయూలో ఉంటూ రోగులకు చికిత్స అందిస్తున్నాడు. రోజూ ఎంతో మంది కోవిడ్ రోగులకు చికిత్స అందించడమే అతని పని. అతని వల్ల ఎంతో మంది కోవిడ్ నుంచి బయట పడ్డారు. ఇక రోజూ అతను ప్రాణాపాయ స్థితిలో ఉండే కోవిడ్ రోగులకు కూడా చికిత్సను అందిస్తున్నాడు.
అయితే తాజాగా అతను ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజులుగా ఐసీయూలో ఉంటూ చికిత్సను అందిస్తున్నానని, ఒత్తిడిని భరించలేకపోతున్నానని అతను తన సూసైడ్ నోట్లో తెలిపాడు. దీంతో అతని మృతి పట్ల తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. అతనికి గత నవంబర్ నెలలో వివాహం జరగ్గా అతని భార్య గర్భవతి. దీంతో అతని ఆత్మహత్య అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…