దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కొనసాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందన్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించిన తరువాత గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 కొనసాగుతుందని గంగూలీ మీడియాకు చెప్పారు. మహారాష్ట్రలో గత శుక్రవారం రాత్రి 8 నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ ఆదివారం కేబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. వారాంతాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. పగటిపూట 144 సెక్షన్ను విధించారు. 5 మందికి పైగా వ్యక్తులు ఒకే చోట గుమిగూడడాన్ని నిషేధించారు. మాల్స్, రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన సేవలను అనుమతించారు. 50 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ కార్యాలయాలను పనిచేయిస్తున్నారు. పరిశ్రమలు కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులకు, మార్కెట్లకు ఎటువంటి ఆంక్షలను విధించలేదు.
అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ క్రీడాకారులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం బోర్డు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…