డిమార్ట్ సూపర్ మార్కెట్ల గురించి తెలుసు కదా. బయట మార్కెట్ కన్నా తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తారని వాటికి పేరుంది. ఆ సూపర్ మార్కెట్ల యజమాని రాధాకృష్ణన్ దమాని. అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఆయన డిమార్ట్ సూపర్ మార్కెట్లతో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా ముంబైలోని అత్యంత పాష్ ఏరియాలో భారీ మొత్తం వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు.
ముంబైలోని మలబార్ హిల్ ఏరియాలో రాధాకృష్ణ దమాని ఏకంగా రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. దాని విస్తీర్ణం 5,752.22 చదరపు అడుగులు. పూరాచంద్, పరేష్చంద్, రాయ్చంద్, ప్రేమ్ చంద్ అనే వ్యక్తుల నుంచి ఆయన ఆ ఇంటిని కొన్నారు. మార్చి 31వ తేదీన ఆయన ఆ ఇంటిని కొనగా కేవలం స్టాంపు డ్యూటీకే రూ.30 కోట్లు చెల్లించారు.
కాగా కరోనా సమయంలో రాధాకృష్ణన్ ఆస్తులు అమాంతం పెరిగాయి. 2020 ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన దేశంలో సంపన్నుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారుగా 15.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ముంబైలో కరోనా వల్ల గతేడాది రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయినప్పటికీ ఇటీవలి కాలంలో ఆ రంగం 112 శాతం వృద్ధి రేటును సాధించింది. రియల్ ఎస్టేట్ అక్కడ మళ్లీ పుంజుకుంటోంది. అయితే 2015లో పూనావాలా గ్రూప్ చైర్మన్ సైరస్ పూనావాలా అక్కడ ఉన్న లింకన్ హౌజ్ను ఏకంగా రూ.750 కోట్లు పెట్టి కొనడం విశేషం.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…