ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన మూడు సిరీస్లను భారత్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత టెస్టు సిరీస్ను 3-1తో తరువాత టీ20 సిరీస్ ను 3-2తో భారత్ స్వాధీనం చేసుకుంది. తాజాగా వన్డే సిరీస్ను 2-1తో దక్కించుకుంది. చివరి వన్డేలో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
అయితే వన్డే సిరీస్ను దక్కించుకోవడంతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ 121 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 118 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో దక్కించుకున్నప్పటికీ న్యూజిలాండ్ అదే స్థానంలో స్థిరపడింది. అయితే వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన భారత్ 119 పాయింట్లను పొందింది. దీంతో వన్డే ర్యాంకింగ్లలో 2వ స్థానానికి చేరుకుంది.
ఇక టెస్టులలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, టీ20లలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 14వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కానుండడంతో ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ తమ తమ టీమ్ల వద్దకు చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ క్రికెట్ సమరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…