టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో నమోదు చేయలేదు. యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లలో వరుసగా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో అతని ఆటతీరుపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2026కు ప్రధాన శాటిలైట్ బ్రాడ్ కాస్టర్గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడాడు. తాను తన బ్యాటింగ్ను ఎంజాయ్ చేస్తానని, గత 2 ఏళ్ల నుంచి అసలు ఒత్తిడి అంటే తనకు తెలియదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నా ఆటతీరును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా చేతుల్లోనే ఉంది.. అని అన్నాడు.
ప్రాక్టీస్ లేదా శిక్షణ ఏదైనా సరే తాను నిరంతరం సాధన చేస్తూనే ఉంటానని అభిషేక్ ఈ సందర్భంగా తెలిపాడు. ఒక బ్యాటర్ కెరీర్లో ఎత్తు పల్లాలు సహజం. నా ఫామ్ గురించి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. రీసెంట్ గా జరిగిన మ్యాచ్లలో నా ప్రదర్శనను పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి అన్నదానిపైనే నేను ఫోకస్ పెట్టా. కచ్చితంగా నా ఆటతీరును ఇంకా మెరుగు పరుచుకుంటా.. అని అభిషేక్ స్పష్టం చేశాడు. ఒత్తిడి లేకపోవడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని, ఒక బ్యాటర్గా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందని అతను అన్నాడు. కొన్నిసార్లు కొన్ని ఇన్నింగ్స్లో బాగా ఆడతామని, కొన్ని సార్లు ఆడలేకపోతామని, మ్యాచ్లలో మాత్రం ఒకేలాంటి దూకుడును కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ విధానం వల్ల అన్ని సార్లు ఫలితాలు రావని, కానీ తన ఉద్దేశాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని అభిషేక్ తేల్చి చెప్పాడు.
కాగా అభిషేక్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లలో బ్యాటర్ ర్యాంకింగ్లలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల తాను ఆడిన మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయినప్పటికీ అది అతని ర్యాంక్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాలో అభిషేక్ ఇప్పటికీ ఇంకా నంబర్ వన్ స్థానంలోనే ఉన్నాడు. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్లో అతను ఔట్ అవుతుండడం వల్ల ప్రత్యర్థి జట్లకు అతని బలహీనత తెలిసిపోయిందని భావిస్తున్నారు. కనుక ఇకపై ఆడే మ్యాచ్లలో అభిషేక్కు ముందుగా పేస్ బౌలర్కు బదులుగా ఆఫ్ స్పిన్ బౌలర్తో బౌలింగ్ చేయించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే అభిషేక్ శర్మ తిరిగి తన మునుపటి ఫామ్ ను కొనసాగించాలని, సూపర్ 8 దశ ప్రారంభం నేపథ్యంలో అతని నుంచి ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆశిస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ముందు ముందు జరగబోయే మ్యాచ్లలో అభిషేక్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…