దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు. ఇందుకు ప్రధాన కారణం తన దక్షిణాది నేపథ్యమేనని చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ బాలీవుడ్లో అడుగుపెట్టిన సమయంలో ఎదురైన పాక్షికతను వివరించారు. తాను హిందీ భాషలో ప్రవీణురాలినని, తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ, అక్కడ తనను ఔట్సైడర్ గానే చూశారని పేర్కొన్నారు. తనను తక్కువగా చూసే విధానం తనకు స్పష్టంగా తెలిసిందని, ఆ కారణంగా ఉత్తర భారత చిత్ర పరిశ్రమలో పనిచేయడంపై కొంత భయం, సంకోచం కలిగిందని ఆమె అన్నారు.
ఈ పాక్షికత మాటలకే పరిమితం కాలేదని, కొందరి ప్రవర్తనలో కూడా కనిపించిందని రెజీనా తెలిపారు. చాలా మంది తనను అవమానకరంగా ట్రీట్ చేశారని, మాటలతోనే కాదు, వారి చర్యలతో కూడా తనకు అలా అనిపించిందని ఆమె చెప్పారు. అయితే అందరూ అలా ప్రవర్తించలేదని, కానీ ఇలాంటి అనుభవాలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని అంగీకరించారు. చిత్ర పరిశ్రమలో మహిళలు తరచూ రూపం ఆధారంగా స్టీరియోటైప్ చేయబడతారని కూడా రెజీనా అన్నారు. ఇది విజువల్ మీడియా కావడంతో, ఒకసారి ఏదైనా ఇమేజ్ ఏర్పడితే అదే ముద్రపడిపోతుందని చెప్పిన ఆమె, విభిన్నమైన పాత్రలు చేయాలనే తపన తనలో ఎప్పటినుంచో ఉందన్నారు.
నేను ఎప్పుడూ ఒకే తరహా కమర్షియల్ పాత్రల్లో ఇరుక్కోవాలని అనుకోను. వెర్సటైల్గా ఉండాలని కోరుకుంటాను.. అని రెజీనా స్పష్టం చేశారు. బాలీవుడ్లో సవాళ్లు ఎదురైనప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఆ అనుభవాలు తనను మరింత బలంగా తీర్చిదిద్దాయని అన్నారు. రాకెట్ బాయ్స్, ఫర్జి వంటి ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకుల్లోనూ గుర్తింపు సంపాదించుకున్న ఆమె, కాలక్రమేణా చాలా విషయాలు నేర్చుకున్నాను. అవసరం లేని విషయాలను మర్చిపోయాను. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే నమ్మకం ఉంది.. అని తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ను వివాహం చేసుకున్నాడు. శనివారం (ఫిబ్రవరి 21,…
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి…
కాన్పూర్లోని నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్ (NSI) 2026 సంవత్సరానికి గాను కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్…
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న అవాస్తవ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా…
ఈ ఏడాది వేసవి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2తోపాటు…
హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి…
హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ హీరో ప్రభాస్ అన్నారు. సంతోష్ శోభన్, మానసా వారణాసి, కపుల్…
ఇంధన రంగంలో స్థిరమైన, ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాన్ని ఆశించే వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్…