Marriage : మన దేశంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు అయితే తమ అభిరుచులు, ఇష్టాలకు అనుగుణంగా తమ తాహతుకు తగినట్టుగా దుస్తులు కొని వేసుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే విదేశాల్లో ఇందుకు పూర్తిగా భిన్నం. అంటే.. వారు దుస్తులు కొంటారు కానీ.. అవి తెలుపు రంగువే అయి ఉంటాయి. ఏ వర్గానికి చెందిన వారు అయినా, పేదలైనా, ధనికులైనా తెలుపు రంగు దుస్తులను వేసుకునే వివాహం చేసుకుంటారు. అదీ ముఖ్యంగా పెళ్లి కూతురు కచ్చితంగా తెలుపు రంగు దుస్తులను ధరిస్తుంది. ఆ తరువాతే వివాహం చేసుకుంటారు. అయితే వారు ఇలా పెళ్లిలో తెలుపు రంగు దుస్తులనే ఎందుకు వేసుకుంటారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశీ మహిళలు పెళ్లిళ్లలో తెలుపు రంగు దుస్తులను వేసుకునే సాంప్రదాయం 1840వ సంవత్సరంలో మొదలైందని చెప్పవచ్చు. అప్పట్లో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ల వివాహం జరిగింది. అయితే తన పెళ్లి సందర్భంగా క్వీన్ విక్టోరియా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంది. దీంతో చాలా మంది ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఇక మిగిలిన వారు కూడా అలా తెలుపు రంగు డ్రెస్ ను వేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం మొదలు పెట్టారు. అలా ఆ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
అయితే తెలుపు రంగు డ్రెస్నే వధువు వేసుకునేందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. దీంతో పెళ్లి చేసుకునే వారు కూడా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా అలా స్వచ్ఛంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే.. తెలుపు కొత్త జీవితానికి సూచిక. ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని చెబుతుంది. అందుకనే పెళ్లి చేసుకునే దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని తెలియజేసేందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. దీంతోపాటు వివాహ వేడుకలో అందరికన్నా ప్రత్యేకంగా వధువు కనిపించాలనే ఉద్దేశంతోనే అలా తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇవీ.. ఆ దుస్తులను ధరించడం వెనుక ఉన్న అసలు కారణాలు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…