Marriage : మన దేశంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు అయితే తమ అభిరుచులు, ఇష్టాలకు అనుగుణంగా తమ తాహతుకు తగినట్టుగా దుస్తులు కొని వేసుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే విదేశాల్లో ఇందుకు పూర్తిగా భిన్నం. అంటే.. వారు దుస్తులు కొంటారు కానీ.. అవి తెలుపు రంగువే అయి ఉంటాయి. ఏ వర్గానికి చెందిన వారు అయినా, పేదలైనా, ధనికులైనా తెలుపు రంగు దుస్తులను వేసుకునే వివాహం చేసుకుంటారు. అదీ ముఖ్యంగా పెళ్లి కూతురు కచ్చితంగా తెలుపు రంగు దుస్తులను ధరిస్తుంది. ఆ తరువాతే వివాహం చేసుకుంటారు. అయితే వారు ఇలా పెళ్లిలో తెలుపు రంగు దుస్తులనే ఎందుకు వేసుకుంటారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశీ మహిళలు పెళ్లిళ్లలో తెలుపు రంగు దుస్తులను వేసుకునే సాంప్రదాయం 1840వ సంవత్సరంలో మొదలైందని చెప్పవచ్చు. అప్పట్లో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ల వివాహం జరిగింది. అయితే తన పెళ్లి సందర్భంగా క్వీన్ విక్టోరియా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంది. దీంతో చాలా మంది ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఇక మిగిలిన వారు కూడా అలా తెలుపు రంగు డ్రెస్ ను వేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం మొదలు పెట్టారు. అలా ఆ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
అయితే తెలుపు రంగు డ్రెస్నే వధువు వేసుకునేందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. దీంతో పెళ్లి చేసుకునే వారు కూడా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా అలా స్వచ్ఛంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే.. తెలుపు కొత్త జీవితానికి సూచిక. ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని చెబుతుంది. అందుకనే పెళ్లి చేసుకునే దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని తెలియజేసేందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. దీంతోపాటు వివాహ వేడుకలో అందరికన్నా ప్రత్యేకంగా వధువు కనిపించాలనే ఉద్దేశంతోనే అలా తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇవీ.. ఆ దుస్తులను ధరించడం వెనుక ఉన్న అసలు కారణాలు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…