Train Tracks Stones : రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా..? నడిచాం.. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ.. రైలు పట్టాల పక్కన కంకర రాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమ వేగంగా దూసుకువచ్చే రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషీ కాదు. అయితే.. నిజానికి అసలు ట్రెయిన్ ట్రాక్స్ మధ్యలో, పక్కన, చుట్టూ.. ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంకర రాళ్లతో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా..? అసలు కంకర రాళ్లను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో, వాటిని క్రమబద్ధంగా ఎందుకు అమరుస్తారో తెలుసా..? అదే తెలుసుకుందాం రండి..!
రైలు ట్రాక్ కింద, చుట్టూ ఉండే కంకర రాళ్లను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయినా, చెక్క దిమ్మలైనా, వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీపర్స్తో ఒకదానికొకటి ఫిట్ చేస్తారు. దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమరుస్తారు. అయితే ఇలా అమర్చాక ఆ దిమ్మలు, పట్టాలు సరైన పొజిషన్లో ఉండేందుకు గాను చుట్టూ, కింద కంకర రాళ్లను పోసి వాటిని సమం చేస్తారు. దీంతో పట్టాలు, దిమ్మలు, స్లీపర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి అటు, ఇటు కదలవు.
మరి.. పట్టాల పక్కన కూడా కంకర రాళ్లను పోస్తారు కదా.. అంటే అందుకూ కారణం ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంకర రాళ్ల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ పక్కన ఎత్తుగా కంకరను పోస్తారు. అలా పోయడం వల్ల వర్షం పడిన నీరు సులభంగా భూమిలోకి వెళ్లిపోతుంది. ట్రాక్పై నీరు నిలవదు. దీంతో రైళ్లు సులభంగా వెళ్లవచ్చు. వరదకు ట్రాక్ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల మొక్కలు కూడా పెరగవు. కింద చెత్త పేరుకుపోదు. ట్రాక్స్ క్లియర్గా కనిపిస్తాయి. అందుకనే రైల్వే ట్రాక్స్ కింద, చుట్టూ అంతా కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు. ఇవీ.. దాని వెనుక ఉన్న అసలు కారణాలు..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…