Nail Biting : గోర్లు కొరకడం చాలా మందికి ఉండే అలవాటు. చిన్నారులే కాదు, కొందరు పెద్దలు కూడా గోర్లను పదే పదే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్లను కొరకడమనేది చాలా చెడు అలవాటు. అది ఎవరికైనా అస్సలు ఉండకూడదు. ఈ క్రమంలో అసలు ఎవరైనా గోర్లను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా..? పలువురు సైంటిస్టులు, పరిశోధకులు ఇదే విషయంపై స్టడీ చేశారు. అసలు మనం గోర్లను ఎందుకు కొరుకుతామన్న దానికి వారు కొన్ని సమాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామా.
సిగ్నండ్ ఫ్రాయిడ్ అనే ప్రముఖ న్యూరాలజిస్ట్ గోర్లను కొరకడం వెనుక ఉన్న కారణాన్ని ఏమని చెబుతున్నారంటే.. కొందరికి తప్పు చేశామనే భావన మనస్సులో ఉంటుందట. అందుకే వారు దాన్ని అణచుకోలేక పదే పదే గోర్లను కొరుకుతారట. ఏదో తప్పు చేశామన్న భావన ఉన్నవారు ఎక్కువగా ఇలాగే చేస్తారట. బోర్ ఫీలవుతున్న వారు లేదంటే ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నవారు గోర్లను ఎక్కువగా కొరుకుతారట. దాంతో వారి మెదడు కొంత రిలాక్స్ చెందుతుందట. అబ్సెస్సివ్ కంపల్షన్ డిజార్డర్ (ఓసీడీ), ఏడీహెచ్డీ, ఓడీడీ వంటి మానసిక వ్యాధులతో బాధపడేవారు కూడా గోర్లను కొరుకుతారట. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియకే అలా చేస్తారట.
తమ గోర్లు నీట్గా, అందంగా లేకపోతే ఎదుటి వారు ఏమైనా అంటారేమోనన్న భావనతో కూడా కొందరు గోర్లను కొరుకుతారట. పైన చెప్పిన కారణాలు కాకున్నప్పటికీ కొందరికి గోర్లు కొరకడం ఒక అలవాటుగా మారుతుందట. ఉదాహరణకు సిగరెట్, మద్యం తాగడం లాంటివి. అయితే కారణం ఏదైనప్పటికీ ఎవరూ గోర్లను కొరకకూడదు. దాంతో గోర్ల నుంచి బాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తరువాత ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కనుక గోర్లను కొరకడం మానేస్తేనే మంచిది. లేదంటే అనవసరంగా రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…