Soul Weight : ప్రతి మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా ? నిజంగానే ఆత్మ ఉంటుందా ? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ దానిని తప్పు అని సైటింఫిక్ గా నిరూపించలేకపోయారు.
1907 మెక్ డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మధ్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్.
అయితే డగెల్ ప్రతిపాదనను చాలా మంది డాక్టర్లు వ్యతిరేకించారు. మనిషి చనిపోయాక అతడి శ్వాసక్రియ ఆగుతుందని, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగుతాయని, ఇంకా శరీర అతర్భాగంగా జరిగే ప్రతీ క్రియ ఆగుతుందని.. అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాములు తేడా వస్తుందని ఇతర డాక్టర్లు వాదించారు.
ఈ సారి డగెల్ తన ప్రయోగాన్ని 15 కుక్కల మీద చేశాడు. మరణించక ముందు వాటి బరువుకు, మరణించాక వాటి బరువుకు మధ్య ఎటువంటి తేడా రాలేదని నిరూపించాడు. అంటే ఆత్మ కేవలం మనిషికే ఉంటుంది కాబట్టి మనుషుల బరువుకే ఆ 21 గ్రాముల తేడా ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా జీవక్రియ ఆగడం వల్ల 1 నిమిషానికి మనిషి బరువు 0.5 గ్రాము మాత్రమే తగ్గుతుందని నిరూపించాడు. అంటే ఈ 21 గ్రాములు ఆత్మ బరువే అని అతడి వాదన. సైన్స్ దీనికి పరిష్కారం చూపనంత వరకు ఆ లెక్క తేలదు. 21 గ్రాముల బరువు ఆత్మదే అన్నమాట.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…