School Van Driver : రోడ్డు ప్రమాదాలు అనేవి అనేక కారణాల వల్ల జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలు మనకు చెప్పకుండానే చోటు చేసుకుంటాయి. ఎప్పుడు రోడ్డుపై ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ అలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినప్పుడు తన ప్రాణం పోతుందని తెలిసినా ఇతరుల ప్రాణాలను కాపాడేవారే నిజమైన హీరో అనిపించుకుంటారు. అవును.. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లా వెల్లకొయిల్ అనే ప్రాంతంలో ఉన్న ఏఎన్వీ మ్యాట్రిక్ స్కూల్లో సెమలయ్యప్పన్ (49) అనే వ్యక్తి వ్యాన్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే వ్యాన్లో అతని భార్య హెల్పర్గా పనిచేస్తోంది. అయితే జూలై 24వ తేదీన యథావిధిగా అతను స్కూల్ నుంచి 20 మంది పిల్లలను వ్యాన్లో ఎక్కించుకుని వారిని ఇంటి దగ్గర దింపేందుకు తీసుకెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
పిల్లలను ఎక్కించుకుని వ్యాన్ నడిపిస్తున్న సెమలయ్యప్పన్ కు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. అయితే అతను అంతటి స్థితిలోనూ జాగరూకతతో వ్యవహరించాడు. ఓ వైపు తన ప్రాణాలు పోతున్నా కూడా తన కర్తవ్య నిర్వహణను ఆపలేదు. రోడ్డు మధ్యలో ఉన్న వ్యాన్ను ముందుగా రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో వ్యాన్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా పిల్లలు సురక్షితం అయ్యారు. అయితే వ్యాన్ను రోడ్డు పక్కన ఆపేయగానే వెంటనే సెమలయ్యప్పన్ తన సీట్లో కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే స్టీరింగ్పై ఒరిగిపోయాడు.
కాగా ఇది చూసిన స్థానికులు వెంటనే అతన్ని ఆంబులెన్స్లో హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే అతను చేసిన పనికి అందరూ అతని తెగువను అభినందిస్తున్నారు. తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా పిల్లల ప్రాణాలు కాపాడి చాలా జాగ్రత్తగా వ్యవహరించాడని అందరూ అతన్ని కొనియాడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను చెక్కు రూపంలో అందజేసింది. అలాగే ఆ స్కూల్ పిల్లలు అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…