అద్భుతాలు అనేవి ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు వాటిని చూసేందుకు జనాలు తండోప తండాలుగా వస్తుంటారు. గుజరాత్లోని భుజ్లోనూ సరిగ్గా ఇలాగే ఓ అద్భుతం చోటు చేసుకుంది. 9 నెలల వయస్సు ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దీంతో దాన్ని చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు.
గుజరాత్లో ఉన్న భుజ్ ప్రాంతంలో రషీద్ సామా అనే వ్యక్తి 25 ఆవులను పెంచుతున్నాడు. ఆవు పాలను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతని వద్ద ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దాని వయస్సు 9 నెలలు.
సాధారణంగా ఆవు దూడ పుట్టాక 4 ఏళ్లకు పెద్దదై దూడలకు జన్మనిస్తుంది. దూడ పుట్టాక ఆవు ఏడాది వరకు పాలిస్తుంది. అయితే ఆ ఆవు దూడ వయస్సు 9 నెలలే అయినప్పటికీ పాలిస్తుండడం విశేషం. ఆ దూడ రోజుకు 1-2 గిన్నెల నిండా పాలిస్తుందని రషీద్ చెబుతున్నాడు. దీంతో ఆ దూడను చూసేందుకు చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
అయితే ఆ దూడను కొంటామని, దానికి రూ.55వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తామని కొందరు ముందుకు వస్తున్నారు. అయితే దాన్ని అమ్మబోనని రషీద్ తెలిపాడు. ఏది ఏమైనా ఈ విషయం వెటర్నరీ వైద్య నిపుణులకు కూడా అంతుబట్టటం లేదు. దూడ ఎందుకు పాలు ఇస్తుందో వారు కూడా చెప్పలేకపోతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…