అద్భుతాలు అనేవి ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు వాటిని చూసేందుకు జనాలు తండోప తండాలుగా వస్తుంటారు. గుజరాత్లోని భుజ్లోనూ సరిగ్గా ఇలాగే ఓ అద్భుతం చోటు చేసుకుంది. 9 నెలల వయస్సు ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దీంతో దాన్ని చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు.
గుజరాత్లో ఉన్న భుజ్ ప్రాంతంలో రషీద్ సామా అనే వ్యక్తి 25 ఆవులను పెంచుతున్నాడు. ఆవు పాలను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతని వద్ద ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దాని వయస్సు 9 నెలలు.
సాధారణంగా ఆవు దూడ పుట్టాక 4 ఏళ్లకు పెద్దదై దూడలకు జన్మనిస్తుంది. దూడ పుట్టాక ఆవు ఏడాది వరకు పాలిస్తుంది. అయితే ఆ ఆవు దూడ వయస్సు 9 నెలలే అయినప్పటికీ పాలిస్తుండడం విశేషం. ఆ దూడ రోజుకు 1-2 గిన్నెల నిండా పాలిస్తుందని రషీద్ చెబుతున్నాడు. దీంతో ఆ దూడను చూసేందుకు చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
అయితే ఆ దూడను కొంటామని, దానికి రూ.55వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తామని కొందరు ముందుకు వస్తున్నారు. అయితే దాన్ని అమ్మబోనని రషీద్ తెలిపాడు. ఏది ఏమైనా ఈ విషయం వెటర్నరీ వైద్య నిపుణులకు కూడా అంతుబట్టటం లేదు. దూడ ఎందుకు పాలు ఇస్తుందో వారు కూడా చెప్పలేకపోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…