శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మహిళలు పెద్దఎత్తున ఉపవాస దీక్షలు ఉంటూ వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున సంకటహర చతుర్ధిని జరుపుకుంటారు. ప్రతి నెలా కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత వచ్చే మూడవ రోజును సంకటహర చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన సంకటహర చతుర్దశి రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సంకటహర చతుర్దశి వ్రతాన్ని 3, 5, 11, లేదా 21 నెలల పాటు నిర్వహిస్తారు. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత మన మనసులో ఏదైనా బలమైన కోరిక కోరుకునీ 3 గుప్పిళ్ల బియ్యం, ఆ తర్వాత రెండు తమలపాకులు, రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మన కోరికలు తలుచుకుని మూట కట్టాలి.
ఈ విధంగా మూట కట్టిన బియ్యాన్ని వినాయకుడి ముందు ఉంచి ధూపం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలి. అదేవిధంగా సంకటహర చతుర్దశి కథను చదివి ఆ రోజు సాయంత్రం వినాయకుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి సమర్పించి మూడు లేదా 11, లేక 21 ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలోనే ఉదయం పూజ చేసిన బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత ఉపవాసం ఉన్నవారు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…