Car Steering : ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు అలా కాదు. ఎగువ మధ్యతరగతి వారు, ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది..? మధ్యలో ఎందుకు ఉండదు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌతాఫ్రికా వంటి కేవలం కొన్ని దేశాల్లోనే కార్లకు స్టీరింగ్ కుడి వైపుకు ఉంటుంది. మిగతా అన్ని దేశాల్లోనూ స్టీరింగ్ ఎడమ వైపుకు ఉంటుంది. అయితే కుడి లేదా ఎడమ ఏదైనా పెద్ద తేడా ఏం లేదు. ఎటు వైపు ఉండి నడిపినా సౌకర్యవంతంగానే ఉంటుంది. కాగా కొన్ని దేశాల్లో ఒకలా, ఇంకొన్ని దేశాల్లో మరొకలా వాహనాల స్టీరింగ్లు ఎందుకుంటాయంటే అందుకు అక్కడి ట్రాఫిక్ రూల్సే కారణం. ఈ క్రమంలోనే ఎడమ వైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై కుడివైపుకు, కుడివైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై ఎడమవైపుకు వెళతారు. కానీ వాహనాల స్టీరింగ్ మాత్రం ఏదో ఒక వైపుకు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఉండదు.
వాహనం మధ్యలో స్టీరింగ్ ఉంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి రోడ్డును అన్ని వైపులా క్లియర్గా చూడలేడు. దీనికి తోడు స్టీరింగ్ మధ్యలో ఉంటే వాహనం ముందు భాగంలో కేవలం ఒకరు మాత్రమే కూర్చునేందుకు వీలు కలుగుతుంది. దీంతో మొత్తంగా కారులో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుంది. వాహనంలో కుడి లేదా ఎడమ వైపుల్లో ఏదో ఒక సైడ్ మాత్రమే స్టీరింగ్ ఉంటే ఆ వాహనాన్ని సులభంగా యు టర్న్ చేయవచ్చు. మామూలు టర్న్ కూడా చేయవచ్చు. స్టీరింగ్ మధ్యలో ఉంటే కుడి లేదా ఎడమ వైపులకు తిప్పలేరు. అందువల్లే వాహనాలకు స్టీరింగ్ మధ్యలో ఉండదు. ఏదో ఒక వైపు మాత్రమే ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…