YSRCP : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతోంది. దీంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. టీడీపీపై అనర్హత వేటు వేయించే దిశగా వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆర్టికల్ 356ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్ను కలిశారు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవాల్సి ఉండగా.. ఆయన అపాయింట్మెంట్ లభించలేదు.
రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి వ్యాపారంపై సమగ్ర విచారణతో పాటు, గత వారం టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైఎస్సార్సీ నేతలు, కార్యకర్తలు చేసిన విధ్వంసంపై సీబీఐ విచారణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని చంద్రబాబు కోరారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తుతం ఎదురుదాడికి దిగారు. టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎంపీల బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలవనుంది.
ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున టీడీపీని రాజకీయ పార్టీగా అనర్హమైనదిగా ప్రకటించాలని వైఎస్సార్సీ ఎంపీలు ఈసీని అభ్యర్థించనున్నారు. టీడీపీ నేతలు జగన్ను పరుష పదజాలంతో దూషించిన వీడియోలను అందజేసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోపాటు కేంద్రంలోని ఇతర అగ్రనేతలను కూడా కలవనున్నారు. ఇప్పటికే అమిత్షాను కలిసిన వారు ఈ వివరాలన్నింటినీ తెలిపారు. ఈ క్రమంలో అధికార పార్టీపై టీడీపీ బురదజల్లుతోందని వైకాపా నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు కారణం చంద్రబాబునాయుడేనని వైసీపీ నేతలు చెప్పబోతున్నారు. ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి వైసీపీ నేతల ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…