Tollywood : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టాలీవుడ్ సినిమాల విడుదలకు టికెట్ల విషయంలో తీవ్ర వివాదం కొనసాగుతోంది. సినిమా టికెట్ల ధరల విషయంలో ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ నుండి ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే వేదం అంటోంది.
ఆంధ్రప్రదేశ్ తెచ్చిన చట్టసవరణలతో అదనపు షోలు రద్దు కావడంతోపాటు టికెట్ ధరల్ని కూడా తగ్గించేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే థియేటర్స్ క్లోజ్ అయిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేస్తుంటే.. స్టార్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ అంతా వరదలతో అల్లాడిపోతుంటే స్పందించకుండా ఉన్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలయిన వారు.. ఇప్పుడు ఆ అభిమానులు కష్టాల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లు ఒక్కరు కూడా ఏపీ ప్రజల కష్టాలపై స్పందించలేదని అన్నారు.
వీళ్ళు ప్రజల కష్టాలపై స్పందించరు కానీ సినిమా టికెట్ల రేట్లు మాత్రం పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. గతంలో ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు స్పందించి సహాయం చేశారని నల్లపురెడ్డి అన్నారు. అందుకే వారిద్దరూ ఎప్పటికీ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అన్నారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్ల డబ్బును వెనకేసుకుంటున్నారని, వారిని హీరోలుగా మార్చిన ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…