Tollywood : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టాలీవుడ్ సినిమాల విడుదలకు టికెట్ల విషయంలో తీవ్ర వివాదం కొనసాగుతోంది. సినిమా టికెట్ల ధరల విషయంలో ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ నుండి ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే వేదం అంటోంది.
ఆంధ్రప్రదేశ్ తెచ్చిన చట్టసవరణలతో అదనపు షోలు రద్దు కావడంతోపాటు టికెట్ ధరల్ని కూడా తగ్గించేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే థియేటర్స్ క్లోజ్ అయిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేస్తుంటే.. స్టార్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ అంతా వరదలతో అల్లాడిపోతుంటే స్పందించకుండా ఉన్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలయిన వారు.. ఇప్పుడు ఆ అభిమానులు కష్టాల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లు ఒక్కరు కూడా ఏపీ ప్రజల కష్టాలపై స్పందించలేదని అన్నారు.
వీళ్ళు ప్రజల కష్టాలపై స్పందించరు కానీ సినిమా టికెట్ల రేట్లు మాత్రం పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. గతంలో ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు స్పందించి సహాయం చేశారని నల్లపురెడ్డి అన్నారు. అందుకే వారిద్దరూ ఎప్పటికీ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అన్నారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్ల డబ్బును వెనకేసుకుంటున్నారని, వారిని హీరోలుగా మార్చిన ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…