Mohan Babu : తెలుగు సినీ ప్రేక్షకులకు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కలెక్షన్ కింగ్గా, నట ప్రపూర్ణగా తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి అలరించారు. ఈయన కెరీర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తరువాత హీరో అయ్యారు. అప్పట్లో ఈయన నటించి అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. అలాగే ఈయన రజనీకాంత్తో కలిసి చేసిన పెదరాయుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.
అయితే మోహన్ బాబు నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. వివాదాల వద్ద ఆయన అన్ని విమర్శల పాలయ్యారు కూడా. ఇప్పటికే ఆయన సినిమా కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన షూటింగ్లో ఉన్నారంటే.. అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటారట. ఏం చేసినా ఆయన విపరీతంగా కోపం తెచ్చుకుంటారని.. అవసరం అయితే చెంప చెళ్లుమనిపిస్తారని కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అందుకనే ఆయనతో సినిమా అంటే చాలా మంది నటీనటులు జంకుతుంటారట.
ఇక మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చను వేసింది. అప్పట్లో యమజాతకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిందీ సంఘటన. హీరోయిన్ సాక్షి శివానంద్. మూడు రోజుల పాటు షూటింగ్ కూడా అయింది. అయితే ఒక హోటల్ లో ఉదయం షూటింగ్ సమయంలోనే సాక్షి శివానంద్ సెట్కు వస్తూనే మోహన్ బాబును తీవ్రంగా దూషిస్తూ.. ఆయనను దారుణంగా అవమానించిందట. పెద్దగా అరుస్తూ కేకలు పెట్టిందట.
తాను హోటల్లో ఉన్న గదికి మోహన్ బాబు వచ్చారని, ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారం చేసేందుకు యత్నించారని.. ఆరోపిస్తూ సాక్షి శివానంద్ ఆయనపై దారుణమైన ఆరోపణలు చేసింది. అయితే దీనికి కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు ఆమెను తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ ఇస్తానని చెబితే.. వెంటనే నాగార్జున రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారట. ఇక ఆ తరువాత ఆమె శాంతించి కొన్ని కండిషన్ల నడుమ ఎలాగో షూటింగ్ను పూర్తి చేసింది.
తరువాత సాక్షి శివానంద్ మళ్లీ మోహన్ బాబు సినిమాల్లో చేయలేదు. ఆ తరువాత తెలుగులోనూ ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం ఈమె సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఆయన అప్పట్లో ఈ సంఘటన వల్ల దారుణంగా విమర్శల పాలయ్యారు. కానీ తరువాత అంతా సద్దుమణిగింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…