Mohan Babu : తెలుగు సినీ ప్రేక్షకులకు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కలెక్షన్ కింగ్గా, నట ప్రపూర్ణగా తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి అలరించారు. ఈయన కెరీర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తరువాత హీరో అయ్యారు. అప్పట్లో ఈయన నటించి అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. అలాగే ఈయన రజనీకాంత్తో కలిసి చేసిన పెదరాయుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.
అయితే మోహన్ బాబు నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. వివాదాల వద్ద ఆయన అన్ని విమర్శల పాలయ్యారు కూడా. ఇప్పటికే ఆయన సినిమా కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన షూటింగ్లో ఉన్నారంటే.. అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటారట. ఏం చేసినా ఆయన విపరీతంగా కోపం తెచ్చుకుంటారని.. అవసరం అయితే చెంప చెళ్లుమనిపిస్తారని కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అందుకనే ఆయనతో సినిమా అంటే చాలా మంది నటీనటులు జంకుతుంటారట.
ఇక మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చను వేసింది. అప్పట్లో యమజాతకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిందీ సంఘటన. హీరోయిన్ సాక్షి శివానంద్. మూడు రోజుల పాటు షూటింగ్ కూడా అయింది. అయితే ఒక హోటల్ లో ఉదయం షూటింగ్ సమయంలోనే సాక్షి శివానంద్ సెట్కు వస్తూనే మోహన్ బాబును తీవ్రంగా దూషిస్తూ.. ఆయనను దారుణంగా అవమానించిందట. పెద్దగా అరుస్తూ కేకలు పెట్టిందట.
తాను హోటల్లో ఉన్న గదికి మోహన్ బాబు వచ్చారని, ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారం చేసేందుకు యత్నించారని.. ఆరోపిస్తూ సాక్షి శివానంద్ ఆయనపై దారుణమైన ఆరోపణలు చేసింది. అయితే దీనికి కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు ఆమెను తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ ఇస్తానని చెబితే.. వెంటనే నాగార్జున రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారట. ఇక ఆ తరువాత ఆమె శాంతించి కొన్ని కండిషన్ల నడుమ ఎలాగో షూటింగ్ను పూర్తి చేసింది.
తరువాత సాక్షి శివానంద్ మళ్లీ మోహన్ బాబు సినిమాల్లో చేయలేదు. ఆ తరువాత తెలుగులోనూ ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం ఈమె సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఆయన అప్పట్లో ఈ సంఘటన వల్ల దారుణంగా విమర్శల పాలయ్యారు. కానీ తరువాత అంతా సద్దుమణిగింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…