Mohan Babu : తెలుగు సినీ ప్రేక్షకులకు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కలెక్షన్ కింగ్గా, నట ప్రపూర్ణగా తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి అలరించారు. ఈయన కెరీర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తరువాత హీరో అయ్యారు. అప్పట్లో ఈయన నటించి అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. అలాగే ఈయన రజనీకాంత్తో కలిసి చేసిన పెదరాయుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.
అయితే మోహన్ బాబు నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. వివాదాల వద్ద ఆయన అన్ని విమర్శల పాలయ్యారు కూడా. ఇప్పటికే ఆయన సినిమా కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన షూటింగ్లో ఉన్నారంటే.. అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటారట. ఏం చేసినా ఆయన విపరీతంగా కోపం తెచ్చుకుంటారని.. అవసరం అయితే చెంప చెళ్లుమనిపిస్తారని కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అందుకనే ఆయనతో సినిమా అంటే చాలా మంది నటీనటులు జంకుతుంటారట.
ఇక మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చను వేసింది. అప్పట్లో యమజాతకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిందీ సంఘటన. హీరోయిన్ సాక్షి శివానంద్. మూడు రోజుల పాటు షూటింగ్ కూడా అయింది. అయితే ఒక హోటల్ లో ఉదయం షూటింగ్ సమయంలోనే సాక్షి శివానంద్ సెట్కు వస్తూనే మోహన్ బాబును తీవ్రంగా దూషిస్తూ.. ఆయనను దారుణంగా అవమానించిందట. పెద్దగా అరుస్తూ కేకలు పెట్టిందట.
తాను హోటల్లో ఉన్న గదికి మోహన్ బాబు వచ్చారని, ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారం చేసేందుకు యత్నించారని.. ఆరోపిస్తూ సాక్షి శివానంద్ ఆయనపై దారుణమైన ఆరోపణలు చేసింది. అయితే దీనికి కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు ఆమెను తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ ఇస్తానని చెబితే.. వెంటనే నాగార్జున రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారట. ఇక ఆ తరువాత ఆమె శాంతించి కొన్ని కండిషన్ల నడుమ ఎలాగో షూటింగ్ను పూర్తి చేసింది.
తరువాత సాక్షి శివానంద్ మళ్లీ మోహన్ బాబు సినిమాల్లో చేయలేదు. ఆ తరువాత తెలుగులోనూ ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం ఈమె సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే మోహన్ బాబు సినిమా కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఆయన అప్పట్లో ఈ సంఘటన వల్ల దారుణంగా విమర్శల పాలయ్యారు. కానీ తరువాత అంతా సద్దుమణిగింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…