Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరోలకు వరుసగా యాక్సిడెంట్స్, షూటింగ్ లలో దెబ్బలు, పలు రకాల తీవ్రమైన జ్వరాలతో.. ఒకరి తర్వాత మరొకరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇండస్ట్రీకి ఇదేమైనా శాపమా అనే అనుమానం రేకెత్తుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్ని వెంటాడుతున్న ఈ సమస్య ఏంటో అంటూ.. నెటిజన్లు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సరిగ్గా వినాయకచవితి నాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలయిన సాయి తేజ్ స్పృహ కోల్పోయి మరీ హాస్పిటల్ చేరారు.
ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగానే ఉంది.. తనను, తన సినిమాను ఆదరించినవారందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే వచ్చేస్తానంటూ ఓ ఫోటోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ డౌన్ అయ్యి రెండు వారాలుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక్కడ అంతా క్షేమం.. అంటూ సన్ ఫ్లవర్ లుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధ్ కు కూడా మహాసముద్రం షూటింగ్ లో గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. రెపో 19 సినిమా షూటింగ్ లో రామ్ పోతినేనికి సైతం మెడకు గాయం అవ్వడంతో ఇక ఈ విషయంలో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదైనా గండం ఉందా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…