Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరోలకు వరుసగా యాక్సిడెంట్స్, షూటింగ్ లలో దెబ్బలు, పలు రకాల తీవ్రమైన జ్వరాలతో.. ఒకరి తర్వాత మరొకరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇండస్ట్రీకి ఇదేమైనా శాపమా అనే అనుమానం రేకెత్తుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్ని వెంటాడుతున్న ఈ సమస్య ఏంటో అంటూ.. నెటిజన్లు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సరిగ్గా వినాయకచవితి నాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలయిన సాయి తేజ్ స్పృహ కోల్పోయి మరీ హాస్పిటల్ చేరారు.
ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగానే ఉంది.. తనను, తన సినిమాను ఆదరించినవారందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే వచ్చేస్తానంటూ ఓ ఫోటోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ డౌన్ అయ్యి రెండు వారాలుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక్కడ అంతా క్షేమం.. అంటూ సన్ ఫ్లవర్ లుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధ్ కు కూడా మహాసముద్రం షూటింగ్ లో గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. రెపో 19 సినిమా షూటింగ్ లో రామ్ పోతినేనికి సైతం మెడకు గాయం అవ్వడంతో ఇక ఈ విషయంలో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదైనా గండం ఉందా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…