Sai Pallavi : సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వివాదాలకు కాస్త దూరంగానే ఉండేందుకు యత్నిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటారు. వారు చేసే పనులు, పెట్టే కామెంట్లు, మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో కొందరికి నచ్చవు. దీంతో వివాదాస్పదం అవుతుంటారు. సినిమాలు చేశామా.. హిట్ కొట్టామా.. వెకేషన్కు వెళ్లామా.. మళ్లీ సినిమా మొదలెట్టామా.. అన్నట్లుగానే చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు. ఎవరూ అంత సులభంగా వివాదాల్లో కావాలని చిక్కుకోరు. కానీ సాయిపల్లవి పంథా చూస్తుంటే మాత్రం కావాలనే మళ్లీ వివాదంలో ఇరుక్కోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.
సాయిపల్లవి సహజంగానే ఏ వివాదం వైపుకు వెళ్లదు. కానీ ఇటీవలే ఆమె విరాట పర్వం సినిమా రిలీజ్కు ముందు అనవసరంగా ఓ వర్గం వారిని బాధపెట్టేలా వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసిందా.. లేక ఆ వ్యాఖ్యలు నిజంగానే వాళ్లను బాధపెట్టాయా.. ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడిందా.. అన్నది పక్కన పెడితే.. ఏదో తెలిసో తెలియకో అలా మాట్లాడింది అనుకుంటే.. ఆ గొడవ అక్కడితో అయిపోయింది. ఆమె సారీ కూడా చెప్పేసింది.
అయితే మళ్లీ అదే గొడవ గురించి కామెంట్లు చేస్తుంటే ఏమనాలి ? మళ్లీ అయిపోయిన దాన్ని తిరిగి తోడడం ఎందుకు ? ఒకసారి కామెంట్స్ చేశాకే గొడవలో ఇరుక్కుంది. అలాంటి దాంట్లోకి మళ్లీ వెళ్లడం ఎందుకు ? తెలిసి తెలిసీ వివాదంలో మళ్లీ చిక్కుకుపోవడం ఎందుకు ? చూస్తుంటే ఇదంతా ఆమె కావాలనే చేస్తుందా.. అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చకుండా ఉంటే మంచిది. అసలే ఆఫర్లు లేక ఆమె కెరీర్ డౌన్ ఫాల్లో ఉంది. ఇలాంటి సమయాల్లో వివాదాల్లో ఇరుక్కోవడం అవసరమా.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సాయిపల్లవి ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…