దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. ఇక ఓటీటీలోనూ ఈ మూవీ ఘన విజయాన్ని సాధించి రికార్డు స్థాయిలో వ్యూస్ను రాబడుతోంది. ప్రస్తుతం విదేశీయులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా RRRకు సంబంధించి ఒక వార్త వైరల్గా మారింది. అదేమిటంటే..
RRR మూవీలో చరణ్ అల్లూరిగా, తారక్ భీమ్గా కనిపించిన విషయం విదితమే. అయితే మూవీ విడుదలకు ముందు సినిమా నిడివిని తగ్గించడం కోసం కొన్ని సీన్లను డిలీట్ చేశారు. వాటిల్లో రామ్ చరణ్ బాల్యం సీన్ కూడా ఒకటి ఉంది. ఇది కాన్సెప్ట్ ఆర్ట్ సీన్. ఇందులో చరణ్ చిన్నారిగా కనిపిస్తాడు. పండితుల ఆశీర్వచనాలు తీసుకుంటుంటాడు. అతని దగ్గర అగ్ని ఉంటుంది. అగ్ని సాక్షిగా అల్లూరి పండితుల సమక్షంలో ఆశీస్సులను తీసుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ సీన్ సినిమాలో లేదు.
కాగా ఈ సీన్ను RRR మూవీ కోసం పనిచేసిన కాన్సెప్ట్ డిజైనర్ విశ్వనాథ్ సుందరం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ సీన్ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు చాలా మంది ఇంత మంచి సీన్ను సినిమా నుంచి ఎందుకు తొలగించారు.. అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సీన్లను ఇలాగే సినిమా నుంచి డిలీట్ చేశారని.. వాటిని అనవసరంగా తొలగించారని అంటున్నారు.
అయితే డిలీట్ చేసిన సీన్లను కనీసం యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. మరి ఆ సీన్లను మేకర్స్ యూట్యూబ్లో పెడతారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించగా.. ఇందులో హాలీవుడ్ తార ఒలివియా మోరిస్, బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగన్లతోపాటు శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…