Aditya 369 : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్షనిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది.
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ కూడా అప్పటిలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఆదిత్య 369 సినిమా తర్వాత బాలయ్య కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకులు ఎందరో బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ కట్టారు.
అలాంటి ఈ అద్భుతమైన చిత్రంలో సినీ ప్రముఖులకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉన్న టైం ట్రావెల్ కథ చెప్పడం, ఆ తర్వాత ఆ సినిమా చేయడానికి నిర్మాత ఒకే చెప్పడం జరిగాయట. ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం, ఆయన వద్దకు వెళ్లి కథ గురించి చర్చలు జరపటం, బాలయ్య కూడా ఒకే చెప్పడంతో సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందట.
మొదట్లో ఈ సినిమాకి సుమారు 1 కోటి 30 లక్షలు రూపాయలు అవుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్ మరో 30 లక్షలు అదనంగా ఖర్చు చేయడం జరిగింది. ఇక షూటింగ్ లో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీ గా ముందుకు వచ్చారట. దీనితో సినిమాకు ఒక కోటి 52 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది.
మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు అనే పేర్లు అనుకోవటం జరిగింది. కానీ చివరికి ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే అంకెలను జత చేయడం జరిగింది. ఇలా ఈ సినిమా జూలై 18, 1991 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ అనే కొత్త కథాంశం కావడంతో అప్పటిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా విజయశాంతిని అనుకోవడం జరిగిందట. కానీ ఆమె అప్పటికే వేరే చిత్రాలతో బిజీ ఉండటంతో మోహిని హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…