Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటూనే షికార్లు చేస్తోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. నార్త్ ఇండియాలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది సమంత.
ఇలా తీర్థయాత్రలకు వెళ్లడం వెనక అంతారార్థమేంటో అంటూ.. అంతా ఆరా తీస్తున్నారు. దీనికి పెద్దగా కారణాలేవి లేవు కానీ, ప్రాణంగా ప్రేమించిన నాగ చైతన్య దూరం కావడంతో చాలా డిస్టర్బ్ అయిన సామ్.. మానసిక ప్రశాంతత కోసమే ఇలా తీర్థ యాత్రలకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాత జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాక మళ్లీ తన సినిమా షూటింగ్స్తో బిజీ కానుందని అంటున్నారు.
ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ శాకుంతలంతోపాటు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోయే సినిమాకు సైన్ చేసింది. అలాగే తమిళంలో విఘ్నేష్ శివన్ సినిమాతోపాటు డ్రీమ్ వారియర్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా ఈ అమ్మడు పని చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…