Governor : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు.. తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. తనను ఎక్కడికి వెళ్లినా అవమానిస్తున్నారని ఇప్పటికే గవర్నర్ తమిళిసై పలుమార్లు వాపోయారు. ఆ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షాలను ఆమె కలిశారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆమె వివరించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అధికారులు తనను రిసీవ్ చేసుకోవడం లేదని.. తన అధికారిక పర్యటనలకు వారు రావడం లేదని.. అలాగే ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని తమిళిసై ప్రధాని మోదీ.. అమిత్ షాలకు వివరించారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో గవర్నర్ మార్పు అనివార్యమని తెలుస్తోంది.
తెలంగాణకు ఇకపై తాను గవర్నర్గా ఉండలేనని తమిళిసై.. మోదీ, షాలకు చెప్పినట్లు సమాచారం. ఇటీవలే ఆమె ఢిల్లీ వెళ్లినప్పపుడు ఈ విషయాన్ని ఆమె చెప్పారట. అయితే తాజాగా ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఆమెకు చూచాయగా ముందే సమాచారం అందించారట. దీంతో ఆమెను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్గా జగ్దీప్ ధన్ఖర్ నియామం కానున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నారు.
అయితే జగ్దీప్ ధన్ఖర్ ఇప్పటికే దీదీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఆయన ఆమెకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. దీంతో ఆయనను తెలంగాణకు గవర్నర్గా రప్పిస్తే.. అప్పుడు సీఎం కేసీఆర్కు గుణపాఠం చెబుతారని అంటున్నారు. జగ్దీప్ గవర్నర్గా వస్తే సీఎం కేసీఆర్ ఆటలు సాగనివ్వరని.. కనుక గవర్నర్గా ఆయన ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రేపో మాపో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తమిళిసై వాస్తవానికి మృదు స్వభావి. కనుక ఆమె కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టే ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో జగ్దీప్కు ఆ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం నిజమే అయితే రానున్న రోజుల్లో గవర్నర్కు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…