Vivo Y21T : మొబైల్స్ తయారీదారు వివో.. వై21టి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వై సిరీస్లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా.. ఇందులో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వివో వై21టి స్మార్ట్ ఫోన్లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ను ఇచ్చారు.
ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్లు, ఒక మైక్రో ఎస్డీ కార్డు కోసం మొత్తం 3 స్లాట్లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను అదనంగా ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
వివో వై21 టి స్మార్ట్ ఫోన్ పెరల్ వైట్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.16,490గా ఉంది. దీన్ని అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…