News : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆమెకు ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన అతను ఆగ్రహంతో ఊగిపోయి ఆమెపై దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని చాందిని మహల్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి తన భార్య (32)ను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఆమె ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ ఆమెను వేధించడమే కాక.. ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. ఇద్దరి మధ్యా తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి. వీరికి ఒక కుమార్తె ఉంది.
కాగా గత శుక్రవారం యథావిధిగా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన రహమాన్ తన భార్యపై దాడి చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కత్తితో నరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తె తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి హతాశురాలైంది. దీంతో వెంటనే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రహమాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతను ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసులకు అక్కడి ఖ్వాజా మీర్ దర్ద్ అనే ప్రాంతంలో దొరికాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ సమయంలో అతను రక్తపు మరకలతో కూడిన చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…