News : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆమెకు ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన అతను ఆగ్రహంతో ఊగిపోయి ఆమెపై దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని చాందిని మహల్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి తన భార్య (32)ను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఆమె ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ ఆమెను వేధించడమే కాక.. ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. ఇద్దరి మధ్యా తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి. వీరికి ఒక కుమార్తె ఉంది.
కాగా గత శుక్రవారం యథావిధిగా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన రహమాన్ తన భార్యపై దాడి చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కత్తితో నరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తె తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి హతాశురాలైంది. దీంతో వెంటనే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రహమాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతను ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసులకు అక్కడి ఖ్వాజా మీర్ దర్ద్ అనే ప్రాంతంలో దొరికాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ సమయంలో అతను రక్తపు మరకలతో కూడిన చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…